ఆగస్టు రేషన్ తీసుకోకపోతే... కష్టమే!
Published Saturday, 23 July 2016రామచంద్రపురం/ మండపేట, జూలై 21: ఆగస్టు నెలలో తెల్లకార్డు వినియోగదారులు ఆగస్టు నెలలో రేషన్ సరుకులను తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులు మనుగడలో ఉండవని జిల్లా పౌర సరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జిల్లాలో 14 లక్షల 40 వేల తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో సక్రమ రీతిలో 13 లక్షల 30 వేల మంది మాత్రమే రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్నారు. మిగిలిన లక్షా 10 వేల మంది రేషన్కార్డుదారుల పరిస్థితి విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోను ఎక్కడి నుండైనా తెల్లకార్డుదారులు తమ సరుకులను పోర్టబిలిటి విధానంలో తీసుకునే అవకాశం ఉందన్నారు.