ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం
Published Saturday, 23 July 2016మానవపాడు, జూలై 22: ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తయారైందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. గద్వాల జిల్లా సాధన కోసం చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు శుక్రవారం ఉండవెల్లి నుంచి బూడ్దిపాడు వరకు కొనసాగింది. ముందుగా వైష్ణవి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పాదయాత్రను కొనసాగించారు. అనంతరం ఉండవెల్లి గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బూడ్దిపాడు ఆర్డీఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయని తెలయని జిల్లా మంత్రులు కూడ ఉన్నారంటే ఎంత విడ్డూరమో తెలుసుకోవాలన్నారు.