మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేత
Published Saturday, 23 July 2016పాలకొల్లు, జూలై 21: పట్టణంలోని ఎర్రవంతెన వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టారు. ఈ విగ్రహాన్ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని పై విచారణ చేపట్టి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత విగ్రహం స్థానంలో కొత్తవిగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ వి నారాయణమూర్తి, మున్సిపల్ కమిషనర్ సాయిరామ్, ధనాని ప్రకాష్, ఎఎస్సై ముత్యాలరావుతదితరులు ఉన్నారు.