S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేత

పాలకొల్లు, జూలై 21: పట్టణంలోని ఎర్రవంతెన వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టారు. ఈ విగ్రహాన్ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని పై విచారణ చేపట్టి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత విగ్రహం స్థానంలో కొత్తవిగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ వి నారాయణమూర్తి, మున్సిపల్ కమిషనర్ సాయిరామ్, ధనాని ప్రకాష్, ఎఎస్సై ముత్యాలరావుతదితరులు ఉన్నారు.

కళ్లకు గంతలో 2వ ఎఎన్‌ఎంల నిరసన

సిద్దిపేట, జూలై 22 : ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తు కళ్లకు గంతలతో శుక్రవారం నిరనస వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఎఎన్‌ఎంలకు 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎఎన్‌ఎంలకు పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళన ఉద్దృతం చేస్తామన్నారు.

హరిత తెలగాణకోసం సమష్టి కృషి

తూప్రాన్, జూలై 22 : హరితహారం సాదించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మనోహరాబాద్ శివారులో గల ఐటిసి కన్సూమర్ గూడ్స్ తయారీ యూనిట్‌లో, ముప్పిరెడ్డిపల్లి శివారులో గల ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేది మొక్కలేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఅర్ తన జాతకం ప్రకారం గిట్టంగి మొక్కను నాటారు. అనంతరం విద్యార్థులను నాటిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు.

అసంబద్ధ విధానాలవల్లే అన్నదాత ఆత్మహత్యలు

తొగుట, జూలై 22: ప్రజల ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మల్లన్నసాగర్‌పై నిరంకుశంగా వ్యవహరించడం వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులవి ఆత్మహత్యలు కాదని, ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పల్లెపహడ్‌లో మల్లన్నసాగర్ ముంపు బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రజలను ముంచి కాంట్రాక్టర్లకు మేలుచేసేలా 50 టిఎంసిలకు పెంచిందని విమర్శించారు.

లక్ష కోట్లు లక్ష్యం

కోల్‌కతా, జూలై 22: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. 2030 నాటికి ప్రతిష్ఠాత్మకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్) జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైసి దేవేశ్వర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారం వృద్ధిపథంలోనే కొనసాగుతోందని చెప్పారు. బహుళ వ్యాపార సంస్థ అయిన ఐటిసికి పొగాకు వ్యాపారం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో సంస్థ పొగాకేతర వ్యాపార వృద్ధి.. పొగాకు వ్యాపారం కంటే పెరగాలన్న సూచనలను ఆయన తిరస్కరించారు.

విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

జోగిపేట, జూలై 22: జోగిపేట పట్టణంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్మించిన క్రీడా మైదాన భవనాన్ని శుక్రవారం నాడు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. మూడు కోట్ల రుపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ మైదానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి కృషి చేయడం జరుగుతుందన్నారు.

48గంటల బంద్‌కు అఖిలపక్షం పిలుపు

నర్సాపూర్,జులై 22: నర్సాపూర్ మండల ప్రజల అభిప్రాయం మేరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు 48గంటల బంద్‌కు పిలుపునిచ్చారు.

కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు

గజ్వేల్, జూలై 22: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇక్కడి సర్కారు పక్క దారి పట్టిస్తోందని, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూ. 721 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినా రైతులకు చెల్లించకపోవడంలో అంతర్యమేమిటని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సిఎం కెసిఅర్ అన్నదాతలకు ఒరగబెట్టిందేమీలేదని, చివరకు 15వందల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పాపానపోలేదని విమర్శించారు.

దేహదారుఢ్య పరీక్షల్లో 733 మంది అభ్యర్థులకు అర్హత

సంగారెడ్డి టౌన్, జూలై 22: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1254మంది అభ్యర్థులు హాజరైనారు. ఇందులో 733 మంది అర్హత సాధించారు.
వీరందరికీ శనివారం ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎఎస్పీ వెంకన్న, ఎఆర్ ఎఎస్పీ బాబురావు, డిఎస్పీలు తిరుపతన్న, వెంకట్‌రెడ్డి, సిఐలు పోటీలను పర్యవేక్షించారు.

హైదరాబాద్‌లో వంద ‘మన కూరగాయలు’ ఔట్‌లెట్లు

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన కూరగాయాలు’ పథకం విజయవంతం కావడంతో త్వరలోనే హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించబోతున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు. మార్కెటింగ్ శాఖపై మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల్లో జవాబుదారీ కోసం త్వరలో ‘జాబ్ చార్ట్’ ప్రవేశపడుతున్నామన్నారు.

Pages