-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇఎన్సి) సురేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్ఇ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఇఇ) తో బుధవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తేవాలని సిఎం ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి చెంది, ప్రజలు సుఖశాంతులతో జీవించే విధంగా దీవించాలని భగవంతుడిని ప్రార్ధించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ కుటుంబ సభ్యులకు నేనున్నానంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ భరోస కల్పించారు. తీవ్రవాదుల కారణంగా 17 మంది పోలీసులు విధినిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ అమర పోలీసుల కుటుంబాల ఇంటికి పోలీసులను పంపించి వారిని ఓదార్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: హైదరాబాద్కు సమీపంలోని మీర్పేట్లో ఇండ్ల కూల్చివేతకు సంబంధించి స్టేటస్కో అమలు చేయాలని హైకోర్టు బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
హైదరాబాద్, అక్టోబర్ 18: శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహ్మాచార్యుల పేరిట గజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల అయింది. ఈనెల 27 ఉదయం 10 గంటలకు ఏకకాలంలో ప్రారంభం కానున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: పెట్రోల్, డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బుధవారం టిఎస్ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో జిఎస్టీపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాజకీయ విశే్లషకులు పి లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఖమ్మం, అక్టోబర్ 18: పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశ పెడుతోంది. మొక్కలు పెంచే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధీనంలోని విజయ డైరీకి పాలుపోసే రైతులకు రాయితీపై పాడి గేదెలను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజాంసాగర్, అక్టోబర్ 18: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో, బుధవారం 1401.00 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గల సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో, నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం జలకళను సంతరించుకుంది. సింగూర్ప్రాజెక్ట్ జలాశయంలోఎగువ ప్రాంతంనుంచి వరద రాకపోవడం వల్ల సింగూర్ ప్రాజెక్ట్ వరద గేట్లను నీటిపారుదల శాఖాధికారులు మూసివేశారు.
గజ్వేల్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్లు, కోదండరాంలకు ప్రజలే గుణపాఠం చెబుతారని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తెలుగుదేశం, టిఆర్ఎస్తోపాటు పలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏఐసిసి కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా చెప్పారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. షరతులతో కాంగ్రెస్లో చేరటం పార్టీ అధినాయకత్వానికి ఎంతమాత్రం ఆమోదం కాదని ఆయన ప్రకటించారు.