S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/29/2017 - 03:14

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో పంటలసాగు విస్తీర్ణానికి సంబంధించి కాకిలెక్కలు ఇవ్వవద్దని, ఖచ్చితమైన సమాచారం మాత్రమే ఇవ్వాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాల వ్యవసాయ అధికారులతో (డిఎఓ) మంగళవారం ఆయన సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా లభిస్తున్న సమాచారం పరిశీలిస్తే ఒకదానికి మరొక దానికి పొంతన ఉండటం లేదన్నారు.

03/29/2017 - 03:11

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో 2022 సంవత్సరం వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు గల అవకాశాలపై మంగళవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ వర్సిటీ మొట్టమొదటి సమన్వయ కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ నిర్ణయించింది.

03/29/2017 - 03:09

హైదరాబాద్, మార్చి 28: కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా లభించే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అదనంగా నిధులు పొందడానికి ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్‌తో ఆర్థికశాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

03/29/2017 - 03:07

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో గిరిజన విద్యార్థినీలకు ప్రత్యేకంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎస్సీ విద్యార్థినీలకు ఇప్పటికే ప్రత్యేకంగా 30 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో అదే మాదిరిగా గిరిజన విద్యార్థినీలకు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

03/29/2017 - 03:07

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించకపోవడానికి గల కారణాలు తెలియచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిడిపి నేత మేడిపల్లిసత్యం దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడచిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీకమిషన్‌ను ప్రభుత్వం నియమించలేదని కోర్టుకు తెలిపారు.

03/29/2017 - 03:06

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో విద్యారంగం రోజురోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న చందంగా మారింది. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య అందుకు తగ్గ నిష్పత్తిలో పెరగడం లేదు. మొత్తంగా చూసుకుంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది.

03/29/2017 - 03:05

హైదరాబాద్, మార్చి 28: మెస్ చార్జీల పెంపు పట్ల హర్షం వ్యక్తం పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిసి కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఉద్యమ సమయంలో చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. 15 శాతం వృద్ధి రేటు ఉంది. పెరిగిన సంపద పేదలకు ఉపయోగపడాలి, వారి జీవితాల్లో మార్పు రావాలి.

03/29/2017 - 03:03

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సంస్థల టర్నోవర్ పెరిగినప్పటికీ, నష్టాలు ఐదేళ్ల కాలంలో రూ. 5895 కోట్లకు చేరాయి. ఎక్కువ రేటు పెట్టి విద్యుత్‌ను కొనుగోలు చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతంత మాత్రంగా ఉండడం, ఎక్కువగా విద్యుత్ పంపణీ నష్టాల వల్ల రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్ధలు నష్టాల్లో ఉన్నాయని కాగ్ తప్పుపట్టింది.

03/28/2017 - 04:22

నిజామాబాద్, మార్చి 27: ఆది నుండి వివాదాస్పదుడిగా ముద్రపడి ఉన్న నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, అతని అనుచరుల ఆగడాలపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో తమ నిరసన గళం వినిపించారు. సోమవారం అన్ని శాఖలకు చెందిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులంతా మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు.

03/28/2017 - 04:19

హైదరాబాద్, మార్చి 27: రాష్ట్రప్రభుత్వం మూస పద్ధతిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిందని , రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, ఊహాజనిత గణాంకాలతో ప్రజలను ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తోందని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం నాడు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ బడ్జెట్ లెక్కలు అవాస్తవికంగా ఉన్నాయని అన్నారు.

Pages