-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: నగర శివారులోని జవహర్నగర్ డంపింగ్ యార్డులో నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ లభ్యమైన ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం ఆర్డీఎఫ్ ఇన్చార్జి గురువారెడ్డి చెత్తను కటింగ్ చేస్తుండగా ఓ ఎరుపు రంగు ట్రావెల్ బ్యాగ్ను గుర్తించాడు. దాన్ని తెరచి చూడగా వెయ్యి రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. ఒక్కసారిగా ఖంగుతిన్న గురువారెడ్డి ఆ బ్యాగును డంపింగ్ యార్డు ఇన్చార్జి కోటేశ్వరరావుకు అందజేశాడు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 23: గత నాలుగు నెలల నుండి కృష్ణానది ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో నది రాళ్లతో దర్శనమిస్తోంది. ఇటు తెలంగాణ రైతులు, అటు కర్ణాటకకు చెందిన రైతులు నదితీర ప్రాంతాలలో వరి పంటలను సాగు చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు నదిలో నీటి ప్రవాహం లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది.
ఖమ్మం, ఫిబ్రవరి 23: ఖమ్మం కార్పొరేషన్గా అవతరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’లో 5531 మంది పిల్లలకు విముక్తి కలిగింది. తప్పిపోయి, ఇంట్లోంచి పారిపోయివచ్చి, పలు పరిశ్రమల్లో బాల కార్మికులుగా చాకిరీ చేస్తున్న చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరిలో కొందరిని తమతమ ఇళ్లకు, మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
హైదరాబాద్/ముషీరాబాద్: దేశంలోని పలు యూనివర్శిటీల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు దేశ భక్తులు, దేశ ద్రోహుల మధ్య జరుగుతున్న సంఘర్షణల ఫలితమేనని ఎబివిపి ఆఖిల భారత సహ సంఘటన కార్యదర్శి జి రఘునందన్జీ అన్నారు. దేశంలోని ఆయా యూనివర్శిటీల్లో జరుగుతున్న సంఘటనలను నిరసిస్తూ మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞాసభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గత ఏడాది 8.8 శాతం ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది 9.2కు చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం, స్థూల ఆదాయం తదితర అంశాలపై మంగళవారం ఆర్థిక గణాంకశాఖ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు నివేదిక అందజేసింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్: ప్రతీ ఏటా రూ. 20 వేల కోట్లకు పైగా నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యాసంస్థలు మెరుగైన పద్ధతుల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ చేరికలు సాధారణమైనవి కాదని, భవిష్యత్తు కోసం, ప్రజల బాగు కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ అని సిఎం కె చంద్రశేఖర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కెసిఆర్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకున్నాం.
హైదరాబాద్: ఎపి హౌసింగ్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో నిధుల గోల్మాల్కు సంబంధించి మెహదీపట్నం ఎస్బిఐ మేనేజర్ కామరాజు ఇంట్లో మంగళవారం సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: విద్యారంగానికి ప్రభుత్వం ఏటా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని, పేదవర్గాల పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఎల్కెజి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.