S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
మనిషి ఆయుర్దాయం ఎంత? మహా అయితే వందేళ్లు. చాలామందికి అంత కూడా లభించదు. ఆ లభించిన దానిలో సగం రాత్రిలో విశ్రాంతికీ, నిద్రకూ ఖర్చయిపోయేదే. మిగిలిన సగ భాగం బాల్యంలో, వృద్ధాప్యంలో పోయేదే.
బాగా వయసులో వున్నప్పుడు ఓపిక నిండా ఉంటుంది. చిత్తమొచ్చినట్లు తిరిగేస్తాం? బాల్యం చూస్తే ఏమీ తెలియని దశ. వృద్ధాప్యంలో అన్నీ తెలిసినా శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన దశ.
నూజివీడులో ఫణిభొట్ల సుబ్రహ్మణ్య శాస్ర్తీ అనే ఓ వైణికుడుండేవాడు.
పది మంది సంగీత రసజ్ఞులను చేరదీసి ఒక చిన్న సంగీత సభ ప్రారంభించి నిర్వహిస్తూ విజయవాడలో సంగీత సభలకొచ్చే పెద్ద విద్వాంసులతో ముందే మాట్లాడుకొని, సంగీత కచేరీలు వారి గ్రామంలో ఏర్పాటు చేస్తూ, ఊళ్లో వున్న వారికి సంగీతాభిరుచి కలిగించే ప్రయత్నం చేస్తూండేవాడు. ఇంటింటికీ తిరిగేవాడు.
అభ్యాస సంగీతంలో వున్న సరళీ స్వరాలు, జంట స్వరాలు అలంకారాలు; స్వరం యొక్క ఉనికిని తెలియజేస్తూ వుండే రచనలు. మన సంప్రదాయంలో, స్వరం అనేది కేవలం పొడిగా వినిపించేది కాదు. స్వరాన్ని అలంకరిస్తేనే తప్ప రాగ స్వరూపం ఏర్పడదు. కీర్తనలకు లయా నిర్దేశం చేసేవి కూడా స్వరాలే. స్వర వర్ణాలతో అలంకరించ గలిగే స్థితికి సాధకుడిని ప్రేరేపించేవే, ఈ స్వరాలు.
మనకు, మన తాత ముత్తాతలు గుర్తున్నా, లేకపోయినా సంసార వృక్షం వారివల్లే విస్తరిల్లిందనే మాట నిజం.
కొందరు జ్ఞానుల బోధలు సరైన కొలతల ప్రకారం కుట్టిన దుస్తుల్లా మనకు కుదిమట్టంగా సరిపోతాయి. మరి కొందరి బోధలు వదులు వదులుగా ఉంటాయి. మొదటి రకం పూర్తిగా అనుసరణీయం. రెండోది ఆలోచించి, అర్థమైతే అనుసరించేవి.
పండుగలూ, పర్వదినాలూ ఇతర దేశాల్లో కంటే మనకే ఎక్కువ.
ఓపల్లెటూళ్లో అన్నదమ్ములు వాటాల కోసం కుస్తీలు పడుతున్నారు. భార్యలకు స్థిమితం లేదు. విషయం తేలదు. ఎవరూ తగ్గటం లేదు. ఈ విషయం క్రమంగా ఆ ఊళ్లో గ్రామ పెద్ద చెవిన పడింది. తనంతట తాను ఆ అన్నదమ్ములిద్దర్నీ కలిశాడు.
ఓతండ్రి తన బిడ్డలే సమస్తమనుకున్నాడు. వాళ్లను ఎంతో ప్రయోజకుల్ని చేయాలని భావించాడు. ఆ తర్వాత వాళ్లు తనను గౌరవ స్థానంలో నిలబెట్టి అందలమెక్కిస్తే చూడాలనుకున్నాడు.
కడుపు మాడ్చుకుని అంతా పిల్లల కోసమే ప్రోగుచేస్తూన్నాడు. వాళ్ల కోసమే ఖర్చు పెడ్తున్నాడు. దాహం వేస్తే, సోడా తాగితే ఖర్చవుతుందని, అది కూడా పిల్లలకే ఉంటుందని వీధి కుళాయి దగ్గర దాహం తీర్చుకుంటున్నాడు.
త్యాగంలోని గొప్పతనం, ఔన్నత్యం, హుందాతనం, నిర్భరత్వం, గుర్తించటం తెలియకపోవడం వల్లనే సంకుచిత భావాలు, స్వార్థం మితిమీరిపోయాయంటారు పెద్దలు. శరీర నిర్మాణంలోని ప్రధానాంశమే త్యాగం. గమనించండి.
‘బహుజన హితాయ, బహుజన సుఖాయ..’ ఆకాశవాణి లోగోలో కనిపించే మాటలు. గత శతాబ్దపు ఐదో దశలో తెలుగుదేశానికి మరపురాని దశకు కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవమే. అందులో ముఖ్యంగా భక్తిరంజని.