S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మారుతి ద దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ను ఈనెల 9న విడుదల చేయనున్నారు.
సంజీవ్, సాయికృప జంటగా జావన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇద్దరం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 8న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ సుధాకర్ మాట్లాడుతూ, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రం గ్యాంగ్రేప్ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు.
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొసరాజు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.
క్యాన్సర్ను నిరోధించే శక్తి మనం నిత్యం వాడే పసుపులో అత్యధికంగా వుంది. అదే విధంగా టమాట, బీట్రూట్, క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్ మరికొన్ని కూరగాయల్లో వుండే బీటా కెరోటిన్ క్యాన్సర్ను సమర్ధవంతంగా నిరోధిస్తుందని తేలింది. సీజన్లవారీగా లభించే మామిడి, అనాస, జామ, నేరేడు, నారింజ, బొప్పాయి, అరటి పళ్ళు కూడా క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి.
లోకనాయకుడు కమల్హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ తనదైన స్టైల్లో సినీ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటనకుగాను ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది. కెరీర్ మొదట్లో ఐరన్లెగ్గా ముద్రపడినా ‘గబ్బర్సింగ్’ పవర్ఫుల్ హిట్తో గోల్డెన్ గాళ్గా మారిపోయింది. వరుస ఆఫర్లతో క్రేజీ స్టార్గా ఎదిగింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో మలయాళ తారల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమా మోహన్ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండగా, అప్పుడే మంజిమా మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఆధునిక మానవుడు దైనందిన జీవితంలో వత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన వైవిధ్యం లేకపోవడం వంటి కారణాలవల్ల అస్వస్థతకు గురవుతున్నాడు. మనిషిని పట్టిపీడించే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్లవల్లే వస్తాయని కార్నిగే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లేర్షా తన పరిశోధనల్లో నిర్ధారించారు.
...........
టీనేజ్ అమ్మాయికి పర్వతారోహణే ప్రాణం ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు తహతహ
ఏడింటిలో మూడు పర్వతాలు అధిరోహణ
...........
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే మా కోసమే అనుకునే పిల్లల ఆనందం వానలో తడిసిముద్దయిన వేళలో ఇంద్రధనస్సులా మనసు వికసిస్తుంది. ఆ తరవాత అనారోగ్యం పాలవుతారు. చిన్నారులకు నీళ్లతో ఆడడం అన్నా, వర్షంలో తడవడం అన్నా మహా సరదా. వారిని కట్టడి చేయడం అనుకున్నంత ఈజీ కాదనే చెప్పాలి. కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరి.
కర్నూలు: లంచం ఇవ్వలేదంటూ లారీ డ్రైవర్పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. గోస్పాడు మండలం సాంబవరం మెట్ట దగ్గర పోలీసుల దాడిలో లారీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.