S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 05:29

కొచ్చి, మే 2: న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న 30 ఏళ్ల దళిత యువతిపై ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో అత్యాచారం, దారుణ హత్య జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విష యం వెల్లడైంది. కేరళలోని పెరుంబవూర్‌కు సమీపాన సదరు యువతి నివాసంలో గత నెల 28వ తేదీన ఈ దారుణం జరిగింది.

05/03/2016 - 05:28

ముంబయి, మే 2: 1993 ముంబయి సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అకస్మాత్తుగా ఆదివారం మహారాష్టల్రో ఓ బీజేపీ కార్యక్రమంలో ప్రత్యక్షం కావటంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ జాతి విద్రోహ లక్షణానికి ఇది మంచి ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇది బీజేపీకి కొత్త కాదని ఆ పార్టీ నేత నిజాముద్దీన్ రరుూన్ అన్నారు.

05/03/2016 - 05:28

శంషాబాద్, మే 2: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏం జరిగిందో వివరించకుండానే సుమారు రెండున్నర గంటలు విమానంలోనే ఉంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

05/03/2016 - 05:27

హైదరాబాద్, మే 2: మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో నీటిపారుదల శాఖలో సిబ్బందిని డిప్యూటేషన్‌పై అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేశారు. మిషన్ కాకతీయ పనులు కొన్ని జిల్లాల్లో నత్తనడకన నడుస్తుండడంతో ఆయా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి అధికారులను డిప్యూటేషన్‌పై పంపించారు.

05/03/2016 - 05:26

హైదరాబాద్, మే 2: ఆరోగ్యశ్రీ సేవలపై ఏర్పడిన ప్రతిష్టంభనపై తెలంగాణ ప్రభుత్వం-ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య సోమవారం సచివాలయంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అంగీకరించాయి. వైద్య మంత్రి కె లక్ష్మారెడ్డి నేతృత్వంలో జరిగిన చర్చల్లో దాదాపు 20 మంది ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు రెండుగంటలపాటు చర్చలు కొనసాగాయి.

05/03/2016 - 05:25

హైదరాబాద్, మే 2: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పంటలకు నీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టి.పిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

05/03/2016 - 05:24

హైదరాబాద్, మే 2: డ్రైనేజీ పనిలో కూలీల మృతిపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయనున్నట్టు చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూలీలతో పని చేయించిన ప్రైవేటు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు.

05/03/2016 - 05:24

న్యూఢిల్లీ, మే 2: న్యాయ వ్యవస్థతోపాటు, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుడిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఇక్కడ జంతర్‌మంతర్ వద్ద విహెచ్ ధర్నా చేయనున్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో జడ్జిలుగా బిసిలు తక్కువమందే ఉన్నారని వాపోయారు.

05/03/2016 - 05:22

హైదరాబాద్, మే 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉపరితల బొగ్గు గనుల (ఓపెన్‌కాస్ట్) అధ్యయన యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

05/03/2016 - 05:22

హైదరాబాద్, మే 2: సాంకేతిక విద్య, శిక్షణ మండలి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశపరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సాయంత్రం సచివాలయంలో విడుదల చేశారు. ఏప్రిల్ 21న నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షకు 1,27,972 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,24,747 మంది పరీక్ష రాశారని, వారిలో 1,03,001 మంది అర్హత సాధించారని చెప్పారు.

Pages