S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/20/2016 - 04:17

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భారతి ఎయిర్‌టెల్ ఎపి, తెలంగాణ సిఇవో వెంకటేష్ విజయరాఘవన్ సోమవారం కలిసి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు గురించి వివరించారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు బ్యాంకింగ్ రంగంలో సరికొత్త అనుభవాన్ని అందించనుందని తెలిపారు. ఇది డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

12/20/2016 - 04:15

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రానికి బుధవారం మరో రూ.1,600 కోట్ల నగదు అదనంగా రానుందని, ఇందులో కూడా రూ.500 నోట్లు ఐదు వందల కోట్లు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని తన నివాసం నుంచి సోమవారం జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం వచ్చిన రూ.2,500 కోట్లలో కూడా ఐదు వందల రూపాయల నోట్లు రూ.500 కోట్లు ఉన్నాయని గుర్తుచేశారు.

12/20/2016 - 04:14

కుప్పం, డిసెంబర్ 19: చిత్తూరు జిల్లా గుడుపల్లె మండల పరిధిలోని పొగురుపల్లి గ్రామం వద్ద ఏడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అటు కర్నాటక, ఇటు ఆంధ్ర సరిహద్దుల్లో హల్‌చల్ చేశాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసుకున్న కాస్తో కూస్తో పంటలను సైతం ఏనుగులు ధ్వంసం చేయడమే కాకుండా వ్యవసాయ పరికరాలను కూడా ధ్వంసం చేశాయి.

12/20/2016 - 04:12

విజయనగరం, డిసెంబర్ 19: దేశంలోనే తొలి డిజిటల్ ఆదర్శ గ్రామంగా విజయనగరం మండలం ద్వారపూడి గ్రామం వినుతికెక్కిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కితాబిచ్చారు. తాను దత్తత తీసుకున్న గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దడంలో గ్రామస్థులు ఎంతగానో సహకరించారన్నారు. సోమవారం రాత్రి ఆయన ద్వారపూడి గ్రామంలో సమావేశమయ్యారు. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న ద్వారపూడి నేడు పర్యాటక కేంద్రంగా తయారైందన్నారు.

12/20/2016 - 04:49

విజయవాడ, డిసెంబర్ 19: పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచడంపై ఎపి ప్రభుత్వ వైద్యుల సంఘం సుముఖత వ్యక్తం చేసింది. ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్యను కలిసి ఈమేరకు సంఘం ప్రతినిధులు డాక్టర్ రామ్‌మోహన్, శ్యాంసుందర్ వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని, విరమణ వయసు పెం చడతో పదోన్నతుల అంశంలో నష్టపోతామని భావించామని తెలిపారు.

12/19/2016 - 05:27

హైదరాబాద్, డిసెంబర్ 18: జై ఆంధ్ర ఉద్యమంలో 400 మందికి పైగా యువకులు ఆత్మార్పణం చేశారని, దీనిని మనం ఎప్పుడూ మరవలేమని జన సేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రులను బిజెపి అవమానపరిచిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, 400 మంది త్యాగాలను మర్చిపోకుండా ఎలా ఉండగలమని ఆయన అన్నారు.

12/19/2016 - 05:25

హైదరాబాద్, డిసెంబర్ 18: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా అబద్దాలు చెబుతూ యువతను మోసం చేస్తోందని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 31 నెలలైందని, నెలకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ.

12/19/2016 - 05:24

హైదరాబాద్, డిసెంబర్ 18: బ్యాంకుల్లో కొత్త కరెన్సీ సామాన్యులకు అందకుండా ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో కేంద్రం దర్యాప్తు జరిపించాలని టిడిపి అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 40 రోజులు గడచినా ఇంతవరకు చిలర్ల నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదన్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్ధ చిన్నాభిన్నమవుతోందన్నారు.

12/19/2016 - 05:19

హైదరాబాద్, డిసెంబర్ 18: రద్దయిన నోట్లను పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన ఘటనలు, కొన్ని చోట్ల రద్దయిన నోట్లను బ్యాంకర్లకు అక్రమ పద్ధతుల్లో ఇచ్చి రెండు వేల రూపాయల కొత్త కరెన్సీని తీసుకున్న వైనంపై దర్యాప్తు చేయాలని సిబిఐ నిర్ణయించింది. దీని కోసం ఆదాయం పన్ను శాఖ, ఆర్‌బిఐతో పాటు స్ధానిక పోలీసుల సహకారం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది.

12/19/2016 - 04:58

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 18: సమిష్టి కృషితో రిజర్వేషన్లు సాధించుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్‌చేశారు. కాపు జెఎసి రాష్టవ్య్రాప్త పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగిన ‘కాపుల ఆకలి కేకలు’ నిరసన కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన్నారు.

Pages