S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/13/2020 - 23:25

గుంటూరు, ఏప్రిల్ 13: పనీపాటా లేని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను అనుచితంగా విమర్శిస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దేవినేని క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/13/2020 - 23:24

గుత్తి, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడువు ముగిసినందున తమను ఇళ్లకు పంపాలంటూ క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వలస కూలీలు పోలీసులపై తిరగబడి రాళ్లురువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

04/13/2020 - 23:21

గుంటూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, మరో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రతి నియోజకవర్గంలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

04/13/2020 - 23:18

గుంటూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మైనార్టీలపై అక్కసు వెళ్లగక్కుతూ అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీలను కించపరిచేలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.

04/13/2020 - 23:17

నెల్లూరు, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ గల బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 55కు చేరింది. సోమవారం తాజాగా నాలుగు కేసులు వెలుగుచూడటంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌కు గురైన బాధితుల సంఖ్య 55కు చేరినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. సోమవారం 32 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా, వారిలో నలుగురు పాజిటివ్‌గా తేలారు.

04/13/2020 - 23:10

విజయవాడ, ఏప్రిల్ 13: కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు సంస్థలు సోమవారం విరాళాలను అందజేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 5కోట్ల రూపాయలు, కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్‌లు అందజేసింది.

04/13/2020 - 23:09

హిందూపురం టౌన్, ఏప్రిల్ 13: కరోనా కట్టడి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని మూడు ప్రాంతాల్లో సోమవారం బయోటనె్నల్స్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టనె్నల్‌ను సబ్ కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు.

04/13/2020 - 23:08

గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడిన రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీ పదవి నుండి తొలగించడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

04/13/2020 - 23:00

ఒంగోలు, ఏప్రిల్ 13: ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 41 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోనే 25 కేసులు నమోదు కావటంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా నివసించే ఇస్లాంపేటలోనే కోవిడ్ కేసులు నమోదుకావడంతో ఆ ప్రాంతంలో జిల్లాయంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.

04/13/2020 - 22:54

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగం పరిధికి లోబడే మొత్తం ప్రక్రియ కొనసాగిందని పలువురు న్యాయకోవిదులు అంటున్నారు. ప్రస్తుత ఎస్‌ఈసీ నియామకం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే), ఏపీ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని 200 సెక్షన్ ప్రకారమే జరిగిందంటున్నారు.

Pages