-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న ఇంటర్ విద్యార్థిని వౌనిక తీవ్రగాయాలకు లోనే మరణించింది.
అనంతపురం: పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతూ కిందకు జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మరణించాడు. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తాడిపత్రిలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తుండగా వరప్రసాద్ చేతి నుంచి స్కేల్ జారి రోడ్డుపై పడింది.
హైదరాబాద్ : ఓ వివాహిత మహిళను వేధించనట్లు తన కుమారుడిపై అభియోగాలు రుజువైతే అతను చట్టప్రకారం శిక్షకు అర్హుడేనని మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, పోలీసులు కేసు నమోదు చేశాక తానే స్వయంగా సుశీల్ను తీసుకువెళ్లి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించానన్నారు. ఈ కేసును విపక్షనేత జగన్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని మంత్రి చెప్పారు.
హైదరాబాద్: అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగితేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిహక్కు కల్పించినట్లు గుర్తు చేశారు. స్ర్తి,పురుషుల సమానత్వం దిశగా ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
విశాఖ: వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత పీలా వెంకటలక్ష్మి మంగళవారం ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. నర్సీపట్నంలోని తన ఇంట్లో ఆమె అపస్మారకంగా పడి ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించారన్న విషయమై సమాచారం అందాల్సి ఉంది.
విజయవాడ: పోరంకి గ్రామానికి చెందిన సురేఖ అనే వివాహిత మంగళవారం ఉధయం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలింకా తెలియరాలేదు.
తిరుపతి: ఇక్కడి కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో తొమ్మిదో రోజు మంగళవారం స్వామివారిని పూలమాలలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కపిలేశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకొని కర్పూర హారతులిచ్చారు. ఈ రోజు సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
హైదరాబాద్: అన్ని జిల్లాల్లో ఆధునిక వసతులతో స్టేడియంలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తెలిపారు. కనీసం ఐదు ఎకరాల స్థలం లభిస్తే ప్రతి జిల్లాలో స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు.
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థవన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుండి ఈ నెల 10న చేపట్టబోయే పిఎస్ఎల్వి-సి 32 రాకెట్ ప్రయోగ రిహార్సల్ను సోమవారం షార్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్లోని బ్రహ్మప్రకాష్లో నిర్వహించారు.
విశాఖపట్నం (కల్చరల్): భక్త కన్నప్ప సినిమాలో నటించిన కృష్ణంరాజు కన్నప్ప పాత్రకు ప్రాణం పోశారని, 40 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా నేటీకీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. కృష్ణంరాజును సన్మానించాలని ఐదేళ్ల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చానన్నారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదన్నారు. చివరకు ఈరోజు నా కల ఫలించిందన్నారు.