S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/06/2018 - 23:28

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,912.00 రూపాయలు
8 గ్రాములు: 23,296.00 రూపాయలు
10 గ్రాములు: 29,120.00 రూపాయలు
100 గ్రాములు: 2,91,200.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,114.439 రూపాయలు
8 గ్రాములు: 24,915.512 రూపాయలు
10 గ్రాములు: 31,144.39 రూపాయలు
100 గ్రాములు: 3,11,143.90 రూపాయలు
వెండి

08/06/2018 - 04:34

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ కారణంగా విద్యుత్ వాహనాల తయారీ, వినియోగం గణనీయంగా పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ మొబిలిటీ పాలసీపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పైలట్ ప్రాజెక్టుగా విశాఖలో ఈ వాహనాలను ప్రవేశపెట్టనున్నారు.

08/06/2018 - 03:20

అమరావతి, ఆగస్టు 5: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన విప్లవం కొనసాగుతున్న తరుణంలో వివిధ దేశాలు పర్యావరణ హిత మార్గాలను అనే్వషిస్తున్నాయి. ఉత్పాదనకు తగ్గట్టుగా వినియోగం పెరుగుతోంది. థర్మల్, హైడల్, సౌర, పవన్ విద్యుదుత్పాదన ప్రాజెక్టులతో పాటు అవసరాలు అధికమవుతున్నాయి. ఇంధన వినియోగంలో మన దేశం ప్రపంచంలో తృతీయ స్థానంలో ఉంది.

08/06/2018 - 02:59

న్యూఢిల్లీ, ఆగస్టు 5: మహీంద్ర అండ్ మహీంద్ర (ఎంఅండ్‌ఎం), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి బ్లూచిప్ సంస్థల తొలి త్రైమాసిక ఆదాయాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల లావాదేవీల గమనాన్ని నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేశారు. ఎంఅండ్‌ఎం, పీఎన్‌బీ తొలి త్రైమాసిక ఫలితాలు వచ్చే వారం వెలువడనున్నాయి.

08/06/2018 - 02:58

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ మోసపూరితంగా భారీ మొత్తంలో రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు పురోగతిలో ఉందని ఒక సీనియర్ అధికారి శనివారం చెప్పారు.

08/06/2018 - 02:56

న్యూఢిల్లీ, ఆగస్టు 5: గ్రామీణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21న ఐపీపీబీని ప్రారంభించనున్నారు.

08/06/2018 - 01:34

న్యూఢిల్లీ, ఆగస్టు 5: బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను ఉంచకపోతే పెనాల్టీలు వసూలు చేస్తారు జాగ్రత్త. గత ఏడాది 21 ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ను ఖాతాల్లో ఉంచనందు వల్ల కస్టమర్ల నుంచి రూ.5వేల కోట్లను వసూలు చేశాయి. మొత్తం వసూలు చేసిన ఐదు వేల కోట్ల రూపాయల్లో సగానికి సగం ఎస్‌బీఐకు వెళ్లాయి.

08/05/2018 - 02:02

న్యూఢిల్లీ: రూపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపే గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వినియోగదారులకు శుభవార్త. నగదు రహిత చెల్లింపులు జరిపే ఆయా ప్రాంతాలకు చెందిన వినియోగదారులు కొద్దిరోజులపాటు క్యాష్ బ్యాక్ ఆపర్లు వెల్లువెత్తనున్నాయి. ఈ అంశంపై వచ్చిన ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఇందుకు ఆమోదం తెలిపింది.

08/05/2018 - 01:46

ముంబయి, ఆగస్టు 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 219.31 పాయింట్లు పుంజుకొని, 37,556.16 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 82.45 పాయింట్లు పెరిగి, 11,360.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.

08/05/2018 - 01:44

కోల్‌కతా, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబులు దీర్ఘకాలంలో మూడుకు తగ్గొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉన్న శ్లాబ్ మినహా నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయని, వీటి సంఖ్య మూడుకు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Pages