S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/13/2019 - 01:52

పదహారు మంది కర్నాటక ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలు చేసి తాము ప్రజల వద్దకు వెళతామని వారు కోర్టుకు తెలిపారు. రాజీనామాలను ఆమోదించకుండా తమపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కూడా వారు కోర్టుకు విన్నవించారు.

07/11/2019 - 01:31

ఆంధ్రా, తెలంగాణ,కేరళ రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ పాగా వేస్తుందా? ఈ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే భాజపా అధికారంలోకి రావడం కల్ల అని ఎవరైనా చెబుతారు. కాని రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతాన్ని జయించి జోరుమీదున్న భాజపా తాజాగా తెలంగాణ దృష్టి సారించింది. ఆంధ్రా, కేరళలో బలపడాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది.

07/10/2019 - 02:48

ఎన్నికల ప్రక్రియ మరింత జవాబుదారీగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మన దేశంలో విలువలను పాటించాలంటే, ప్రజల నమ్మకాన్ని ఇనుమడింపచేయాలంటే, రాజకీయ పార్టీల్లో విశ్వసనీయతను పెంచాలంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈవీఎంలకు అనుసంధానంగా ఉండే వీవీ ప్యాట్‌ల చీటీల లెక్కింపును పెంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు జవాబుదారీతనాన్ని పెంచుతాయా?

07/07/2019 - 02:42

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, మన దేశంలోనే దిగవంత నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన వినూత్న ఒరవడిని సృష్టించింది, ప్రజల పట్ల పాలకులకు ఉండదగిన కర్తవ్యానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. 2003లో ప్రతిపక్ష నాయకుడిగా 1475 కి.మీ మేరకు మండుటెండలో వైఎస్ జరిపిన చారిత్రాత్మక ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు కలిగించింది.

07/05/2019 - 21:54

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నడవడి పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండో ర్‌లో భాజపా శాసనసభ్యుడు ఆకాశ్ వర్గియా మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం, ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరి ణామాలపై మోదీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

07/04/2019 - 02:44

చర్చల ద్వారా చిరకాల సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. ముఖాముఖిగా కూర్చుని వివాదాలపై మాట్లాడుకోవడం వల్ల వాతావరణం తేలిక పడుతుంది, ఉద్రిక్తతలు చల్లారుతాయి, అపోహలు అంతరిస్తాయి. చిన్నాచితకా సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తుంది. కోర్టుల గుమ్మం ఎక్కడం, కేంద్రం వద్దకు వెళ్లి ఒకరిపై ఒకరు పితూరీలు చేసుకునే పని ఉండదు.

07/03/2019 - 04:37

అంతర్జాతీయ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి, సరళీకృతం చేయడానికి ప్రారంభమైన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ (డబ్ల్యూటీవో) పై అమెరికా ‘పెద్దన్న’ పాత్ర ఇక ఎంతో కాలం కొనసాగే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గ్రహించిన అమెరికా కొద్ది రోజులుగా తాను ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి తప్పుకుంటానంటూ గాండ్రింపులు ప్రారంభించింది. దానికి కారణాలు లేకపోలేదు. చాలా దేశాలు అమెరికా వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘనను తప్పుపట్టడమే.

06/30/2019 - 03:52

ఎన్నికల రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఓడలు బండ్లవుతాయి.., బండ్లు ఓడలవుతాయి. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇక ఆ పార్టీ కథ ముగిసిందని అనుకోవడం పొరపాటే అవుతుంది. గతంలో అనేకమార్లు ఇదే నిజమని రుజువైంది. ఒకప్పుడు రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 300లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఒకప్పుడు 400 మార్క్ దాటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండంకెల సంఖ్య (52) దగ్గరే ఆగిపోయింది.

06/29/2019 - 00:20

పార్లమెంట్‌లో తిరుగులేని ఆధిక్యత ఉన్నంత మాత్రాన రాజకీయ సుస్థిరత ఆశింపలేమని, ప్రభుత్వం అభద్రతకు గురికాకుండా అడ్డుకో లేమని గతంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వెల్లడి చేస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో 400కు పైగా సీట్లు గెలుపొందినా అభద్రతకు గురికావడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకు వచ్చారు.

06/28/2019 - 02:49

కండపట్టి ఉండే కొన్ని జంతువులు క్రూర జంతువుల నుండి తప్పించుకునేందుకు అప్పుడపుడు వలసపోతుంటాయి. పరిస్థితులు చక్కబడగానే తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. కొన్ని పక్షుల్లో, జంతువుల్లో తల్లే స్వయంగా సురక్షిత ప్రదేశంలో పిల్లల్ని ఉంచి అనుకూల పరిస్థితులు వచ్చాక వాటిని తిరిగి తెచ్చుకుంటుంది.

Pages