S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

08/25/2018 - 00:21

నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. రాకెట్లకంటే స్పీడుగా అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ధరలను చూసి సామాన్యుడు ఆందోళనతో తల్లడిల్లిపోతున్నాడు. గత ఆరు నెలల కాలంలో ఉద్యోగస్తుల, పెన్షనర్ల జీతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగక పోయినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా వ్యాపారులు మాత్రం సరకుల ధరలను తగ్గించకపోవడం గమనార్హం.

08/23/2018 - 23:40

ప్రధాన నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం నేడు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు విచ్చలవిడిగా అపార్ట్‌మెంట్లను నిర్మించడం పరిపాటిగా మారింది. ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

08/23/2018 - 21:05

దేశంలో మాతృభాషలు మనుగడ కోల్పోతున్నాయని తాజాగా ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ సర్వే తెలియజేస్తోంది. వేగంగా చొచ్చుకువస్తున్న పాశ్చాత్య సంస్కృతి, భాషా, సాంస్కృతిక వలసలు, ఆంగ్లం, హిందీ భాషలపై పెరుగుతున్న మోజు, మాతృభాషకు ప్రజలపరంగా, ప్రభుత్వపరంగా ఎదురౌతున్న నిరాదరణ ఫలితంగా దేశంలో అనేక అమూల్యమైన భాషలు అంతరించిపోవడానికి కారణవౌతున్నాయి.

08/20/2018 - 23:09

జల విలయంతో అతలాకుతలమై అవస్థలు పడుతున్న కేరళ వరద బాధితులకు దేశ ప్రజలంతా మానవతా దృక్పథంతో అండగా నిలవాలి. కేరళ అనగానే ప్రకృతి సోయగాలు, పర్యాటక ప్రాంతాలు, కొబ్బరి తోటలు, దేవాలయాలు దర్శనమిస్తాయి. వరుణుడు పగబట్టినట్లు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురియడంతో వరదల ధాటికి కేరళలో వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. భారీగా పంట నష్టం, ఆస్తినష్టం జరిగింది. లక్షలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.

08/19/2018 - 00:23

ఈ మధ్య తెదేపా యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఒక చాలెంజ్ విసిరాడు. జగన్, పవన్‌లకు ధైర్యముంటే మోదీని తిట్టాలన్నదే ఆ చాలెంజ్! అయ్యో! రాజకీయాల్ని ఏ స్థాయికి దిగజార్చారు! ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎవరినీ తిట్టరాదు. కాని ఇలాంటి చాలెంజ్‌లు వింటుంటే వీరికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అర్థం అవుతోంది. వీరి దృష్టిలో ప్రధానిని తిట్టడమే తెదేపా సభ్యులకు అదనపు అర్హత అనుకోవాలి.

08/17/2018 - 00:31

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఇది చివరి సంవత్సరం. ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం కొన్ని నెలల్లో ఏర్పడాల్సి ఉంది. అందరూ ఊహించినట్టుగానే ప్రధాని తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని కాస్త ఎన్నికల శంఖారావంగా తీర్చిదిద్దారు. తనకున్న పెద్ద ఆశయాల్ని, అవి తీరాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గతంలో ప్రకటించిన ఆశయాల సాధనలో ఎంత ముందంజ వేసిందీ అవసరం మేరకు మాత్రమే తెలిపారు.

08/16/2018 - 00:30

ఒకప్పుడు పాఠశాలల్లో దేశభక్తి గేయాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ‘నేనూ నా దేశం, నీ ధర్మం నీ సంఘం, గాంధీ పుట్టిన దేశం, పుణ్యభూమి నా దేశం, భలేతాత మన బాపూజీ.. వంటి సినీ గేయాలు, సారే జహాసె అచ్చా, హింద్‌దేశ్‌కే నివాసి, పిల్లల్లార పాపల్లార, హోంగే కామియాబ్.. వంటి సామూహిక గీతాలను, ఎల్లలెరుగని వాళ్ళము అనే ప్రపంచ బాలల గీతం.. ఇంకా అనేక దేశభక్తి గీతాలు నేటితరం పిల్లలకు తెలియవు.

08/14/2018 - 00:36

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు కోరుతూ రాష్ట్రంలోని ప్రజలంతా పోరాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలలో 85 శాతం అమలు చేసినట్లు ఘనంగా ప్రకటించారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా తప్పుల తడకగా వున్న అఫిడవిట్‌ను దాఖలుచేసి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవపట్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది.

08/07/2018 - 22:28

రాజకీయ పార్టీలు ‘ఎన్నికల బాండ్ల’ రూపంలో నిధులు సమీకరించుకోవడానికి వీలు కల్పించే ఫైనాన్స్ బిల్లుకు చట్టసవరణను పార్లమెంటు ఆమోదించడం సరికాదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు వివిధ ప్రైవేటు, కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు ఇచ్చే విరాళాల గోప్యత విషయంలో సంస్కరణలు తెస్తామని- కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత భాజపా సర్కారు గొప్పగా ప్రకటించింది.

08/06/2018 - 23:21

ఏడాది గడచినప్పటికీ దేశంలో ‘వస్తుసేవా పన్ను’ (జీఎస్టీ) విధానం ఇంకా గాడిన పడలేదు. మహిళా సంఘాల పోరాటానికి దిగివచ్చి ప్రభుత్వం శానిటరీ నాప్కిన్స్‌పై పన్ను పూర్తిగా తొలగించింది. నిత్యావసర సరకులు, మందులు వంటి అనేక వస్తువులు వౌలిక అవసరమైనందున వాటిపై కూడా జిఎస్టీ తొలగించాలని సామాన్య, పేద తరగతి ప్రజల విజ్ఞప్తులను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Pages