S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరాయణం
పర్యావరణం ఇపుడు ప్లాస్టిక్ ఆవరణంగా మారిపోతోంది. ఎటుచూసినా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు పేరుకుపోయి పర్యావరణానికి తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోని మొదటి పది దేశాల జాబితాలో భారత్ ఉండడం ఆందోళనకరమైన వాస్తవం. రోజుకి దేశంలో 15 వేల టన్నుల ప్లాస్టిక్ వినియోగవౌతోంది.
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. తమను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని భాజపా నేతలు చెబుతున్నా, ప్రజాభిప్రాయం అనుకూలంగా వుంటే ప్రతిపక్షాలు ఏకమైనా ఓడించలేవు. ఓటమికి దారితీసిన కారణాలను తెలుసుకుని, ప్రధాని మోదీ ఇకనైనా ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి.
దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థకి వెనె్నముకగా నిలుస్తున్న అఖిల భారత సర్వీసులకు జరుగుతున్న ఎంపిక విధానం అత్యుత్తమమైనది, పారదర్శకమైనది. మూడుదశల కఠిన వడపోతలను దాటి ఎంపికైన అభ్యర్థులకు తదుపరి 15నెలల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. అయితే అది ర్యాంకుల్ని ప్రభావితం చెయ్యదు.
స్టేడియంలో కళ్లు చెదిరే షాట్లతో, విన్యాసాలతో, విధ్వంసకరమైన ఆటతో ప్రపంచం నలుమూలలా కోట్లాది అభిమానుల మనసులను గెలిచిన దక్షిణాఫ్రికా సంచలన ఆటగాడు ఎ.బి.డివిలియర్స్ అకస్మాత్తుగా క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పి, క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాడు. అతని రిటైర్మెంట్ దక్షిణాఫ్రికా క్రికెట్కు తీరని లోటు.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ, ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కర్నాటక శాసనసభ ఎన్నికల సమయంలో 19 రోజులపాటు స్థిరంగా ఉండి, ఆ తరువాత ధర పెరగని రోజన్నదే లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కొంత స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రజలకు ఆ ఊరట దక్కలేదు. అక్కడ ధర పెరిగినపుడు ఇక్కడ పంపుల్లో నిర్ద్వంద్వంగా ధర పెరుగుతూ వస్తోంది.
దక్షిణాదిలో వికసించేందుకు, విస్తరించేందుకు ‘కమలం’ కృతనిశ్చయంతో ఉన్నట్టుంది. ఒక జాతీయ పార్టీకి ఆ ఆకాంక్ష సహజమే కానీ, వేగంలోనే ఉంది కీలకమంతా. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణని ప్రకటించి అందరినీ భాజపా ఆశ్చర్యపరిచింది.
కర్నాటకలో ముఖ్యమంత్రి పీఠం ‘కమలనాథుల’ చేతిదాకా వచ్చి ఆగిపోయింది. కాంగ్రెస్ స్నేహహస్తం సాయంతో- కుమారస్వామి (జేడీఎస్) పార్టీకి అవకాశం అందివచ్చేలా పరిణామం ఏర్పడింది. అంటే పరుగుపందెంలో గీత దగ్గరకు చేరిన మొదటివాడి కన్నా ముందుకి- ‘మూడోవాణ్ణి రెండోవాడు ఎత్తి విసిరినట్టు’. మరి గవర్నర్ ఏం నిర్ణయిస్తారో చూడాలి. మెజారిటీకి అతి సమీపంలోకి వచ్చిన బీజేపీకి నైతిక విజయమే ఇది.
వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ వాణిజ్య ఒప్పందంతో భారత్లో రిటైల్ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకొంటాయి. ఇది దేశీయ చిల్లర వర్తక రంగానికి పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశాలు మెండు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయంగా శాసిస్తున్న బడాకంపెనీలు దేశంలోకి చొరబడకుండా నిలువరించడం దాదాపు అసాధ్యం. తలుపులు మూస్తే, కిటికీలోంచి, కిటికీ మూస్తే సందుల్లోంచి ఎలాగోలా లోనికి చొరబడడం ఆ స్థాయి సంస్థలకు మంచినీటి ప్రాయం.
ఈమధ్యనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ అన్నారు-‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’ అని. బహుశా ఆయన ఉద్దేశం ‘ప్రపంచ -అశాంతి’ బహుమతి అయ్యుండొచ్చు. అలా అయితే నూటికి నూరు పాళ్ళు ఆయనే కరెక్ట్. ఎందుకంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా అశాంతి రేపడానికి ట్రంప్ వెనుకంజ వేయడం లేదు. అయితే ఇవన్నీ తన ఎన్నికల వాగ్దానాలే కావడం ప్రపంచ దేశాల ప్రారబ్దం.
తిరుమల బాలాజీ ఆలయాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆలోచన చేసి, విమర్శలు వెల్లువెత్తడంతో వెనకడుగు వేసినప్పటికీ- కేంద్రం వైఖరి సమంజసం కాదు. పురావస్తుశాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకుంటేనే ఆ ధార్మిక స్థలాన్ని కాపాడగలమని అనుకుంటే పొరపాటే. టీటీడీ సంపదపై పెత్తనం చెలాయించడానికే సదరు మార్పులు దోహదపడతాయి. ఇంతవరకూ తమ పరిధిలోఉన్న చారిత్రక సంపద, కట్టడాల్ని సంరక్షించడంలో కేంద్రం చిత్తశుద్ధి చూపిస్తోందా?