S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

06/28/2018 - 23:39

దేశంలో ఎన్నికల ముఖచిత్రం మారిపోతుండడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. మద్యం, ధనం ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తుండడం మంచి పద్ధతి కాదు. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల కింద రికార్డు సృష్టించాయి. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు, నేతలు అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఎన్నికలలో ప్రవహింపజేస్తూ ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభపెడుతున్నారు.

06/26/2018 - 23:22

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక దేశంలో నెలకొన్న తీవ్ర అనారోగ్య పరిస్థితులను కళ్ళకు కట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సూచీలో 2014లో మన దేశానికి వున్న 170వ ర్యాంకు తాజాగా 185వ ర్యాంకుకు దిగజారిపోవడం మన పాలకుల తీవ్ర నిర్లక్ష్యవైఖరిని స్పష్టం చేస్తోంది.

06/25/2018 - 23:46

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి జీవుల సంఖ్య కోట్లాదిగా పెరుగుతూ పోతుందని ఐక్యరాజ్య సమితి లెక్కలు తేల్చి చెప్తున్నాయి. తాజా గణంకాల ప్రకారం దశాబ్దకాలం వరకూ అదుపులో ఉన్న ‘ఆకలి సూచీ’ మళ్ళీ పైపైకి దూసుకుపోవడం ప్రపంచ దేశాలు తలదించుకోవాల్సిన వాస్తవం. ఆకలి, పేదరికం తగ్గించుకోవాలంటూ ప్రతిన బూనిన దేశాలు కార్యాచరణలో విఫలం కావడం ప్రస్తుత దుస్థితికి కారణం. దాదాపు 83 కోట్ల ప్రజానీకం క్షుద్బాధితులు.

06/24/2018 - 00:48

పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. విద్యాబుద్ధులు బోధించి సరస్వతీ కేంద్రాలుగా వెలుగొందాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అంగళ్లుగా మారాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యమైన కారణంగా సామాన్యులు సైతం ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించడంతో దోపిడీ విశృంఖలమైంది. చాలా పాఠశాలలు 25 శాతం దాకా ఫీజులను పెంచేసాయి.

06/22/2018 - 23:29

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వీయ రక్షణాత్మక విధానాలతో కృత్రిమంగా వాణిజ్య యుద్ధమేఘాలు రూపుదాల్చాయి. ఒక్కో దేశమూ తనకు నచ్చినా, నచ్చకపోయినా వాణిజ్య యుద్ధ క్రీడలోకి దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత్ అమెరికా నుండి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువులపై సుంకాన్ని పెంచడం అలా తప్పనిసరి తద్దినంలో భాగమే.

06/20/2018 - 00:01

‘సప్త వ్యసనాలు’ మనిషిని నైతికంగా దిగజారుస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యసనాలను మించిన మరో వ్యసనం ఇప్పుడు ఆబాల గోపాలాన్నీ పీడిస్తోంది. మన సమయాన్నంతా మింగేస్తూ, సెల్‌ఫోన్ వ్యసనం ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గతంలో సెల్‌ఫోన్లు ఉండేవా? అప్పుడు మన పనులేమైనా ఆగాయా? జనాలు బతకలేదా? ఇప్పుడు చేతిలో మొబైల్ లేకుంటే ప్రాణం పోయినంత పనే! ఇంటింట్లో ఎన్ని సెల్‌ఫోన్లో!

06/17/2018 - 01:48

పదిమందికీ ఉపయోగపడే మంచి విషయాలను ఎవరు చెప్పినా ఆచరించి ప్రయోజనం పొందాలి. ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి తెలిసినా నేడు చాలా అపార్టుమెంట్లలో వాటిని ఏర్పాటు చేయడం లేదు. భవనం మీద నుంచి వర్షపు నీరు ఎంత వృథాగా పోతుందో అపార్టుమెంట్ వాసులు ఆలోచించాలి. ఎంతసేపూ భూగర్భం లోనుంచి నీటిని తోడటమే తప్ప, భూమిలోకి నీటిని ఇంకించే చర్యలు ఏ మాత్రం తీసుకోవడం లేదు.

06/15/2018 - 23:43

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి ‘బడి పిలుస్తోంది’ పేరిట వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తిస్తూ ఆ దిశగా అడుగులు వెయ్యడం ముదావహం. అయితే, ఈ ప్రయత్నాలతోబాటు విద్యార్థి ఆరోగ్యం, పోషణపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతోఉంది.

06/14/2018 - 23:12

1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి) ఏర్పడింది. గత 65 ఏళ్ల కాలంగా- తంజావూర్‌లోని సరస్వతి మహల్‌లో ఉన్న వేలాది తెలుగు గ్రంథాలను రాష్ట్రానికి తీసుకువచ్చి, వాటిని జనానికి అందుబాటులో ఉంచాలన్న ధ్యాస ప్రభుత్వాలకు కలగలేదు. అసలు తెలుగుభాషనే పట్టించుకోని వారికి ప్రాచీన గ్రంథాల గురించి ఆసక్తి ఉండకపోవటం విస్మయకరం కాదు.

06/10/2018 - 00:20

నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నలు తమ భూములలో విత్తనాలు నాటడానికి సిద్ధమవుతున్నారు. రైతులు ఇప్పటికే తమ వ్యవసాయ భూములను శుద్ధి చేసుకుని ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ప్రత్తి, మిరప విత్తనాలను కొనుగోలు చేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పురుగుల మందుల దుకాణాల యజమానులు, బ్రోకర్లు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

Pages