S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/20/2017 - 03:42

విద్యార్థులకు నిర్వహించే వార్షిక పరీక్షల ఫలితాలు ప్రకటించగానే లక్ష్యాలు పూర్తయినట్లు కాదు. పరీక్షల లక్ష్యం దీర్ఘకాలికమైనది. ప్రతి పరీక్షకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఒకే మాదిరిగా, ఒకే రీతిగా ఉండాలంటే కుదరదు. ప్రతి ఏడాదీ అది ఒకే రకంగా ఉండదు.

07/19/2017 - 01:14

‘జీఎస్టీ (వస్తు సేవల పన్ను)తో నూతన సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఆర్థిక సంస్కరణల్లో కొత్త యుగం ప్రారంభమైంది. మరపురాని శకానికి శ్రీకారం చుట్టాం’- అంటూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నెత్తిన గుదిబండ వేసింది. నిత్యావసర సరకులను అందుబాటు ధరల నుంచి ‘పన్ను పోటు’తో సామాన్యుడికి చుక్కలు చూపించింది. ప్రజలు అయోమయంలో పడి ఆందోళన చెందుతూ ఉగ్రరూపం ధరిస్తున్నారు.

07/15/2017 - 00:39

‘పారిస్ ఒప్పందం’ నుంచి తాము వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటనతో ప్రపంచం యావత్తు నిర్ఘాంతపోయింది. మానవాళి, జంతుజాలం, వృక్షాలతోపాటు సమస్త ప్రకృతిని వైపరీత్యాలకు గురి చేయడమేనా? ట్రంప్ లక్ష్యం అన్న ఆందోళనతో ప్రపంచ దేశాలు అవాక్కయిపోయాయి. ప్రకృతి వైపరీత్యాలు కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన విషయం కాదు.

07/13/2017 - 01:47

గత కాలంలో చదువు అందరికీ దక్కకపోవటానికి కారణాలు అనేకం ఉన్నాయి. భారతీయ సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ, అగ్ర కుల ఆధిపత్యం కూడా కొన్ని కులాలను చదువుకు దూరం చేశాయి. ఆ నాటి సమాజంలో చదువుకు వున్న ప్రాధాన్యత, సమాజంలో వున్న ఎగుడు దిగుళ్లు, గతంలో వయోజన విద్యా వ్యాప్తికి జరిగిన ప్రయత్నాలు ఈనాడు కీలకమైన చర్చనీయాంశాలు కానున్నాయి.

07/12/2017 - 01:07

‘ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న విద్య వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించేది కాదు. విద్య అన్నది పిల్లల్లో స్వేచ్ఛ, త్యాగం, సేవ, నిస్సాంగత్యం వంటి ఆదర్శాలు ఇనుమడింప చేయగలగాలి’ అన్నారు స్వామి వివేకానంద. నేడు పిల్లలు మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే విద్యనభ్యిసిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు దేహదారుఢ్యం కలిగి, ఐదవ తరగతి చదివిన వారికి హమాలీ ఉద్యోగాలివ్వడానికి ఒక ప్రకటన చేశారు.

07/08/2017 - 01:00

‘‘ఏమండీ.. కొత్తకోడలు కాపురానికి రానంటోందిట.’’
‘‘అదేంటి..? సంప్రదాయబద్ధమైన కుటుంబంలోని పిల్ల అని కోడల్ని చేసుకుంటే..!’’
‘‘సంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల గనుకనే రానంటోంది..’’
‘‘నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు.’’

07/06/2017 - 00:27

ఇరవై ఒకటవ శతాబ్దంలో విద్యార్థికి ‘నేర్చుకోవడమే’ విద్యా కార్యక్రమంలో కీలకం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాకటంలో ఎంత బాధ్యులో, ఉపాధ్యాయుడు కూడా వారిని సమాజంలో నిలిపేందుకు అంత బాధ్యత తీసుకుంటాడు. బోధన సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయుల సేవాతత్పరత అందుకు ఆయువుపట్టుగా నిలుస్తుంది. ఉపాధ్యాయులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని, దాన్ని సులువుగా విద్యార్థులకు అందజేటంలోనే సేవాతత్పరత ఉందని అర్థం చేసుకోవాలి.

07/05/2017 - 01:03

‘రారండోయ్.. వేడుక చేద్దాం..’ అంటూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర పెద్దలంతా ‘వస్తు సేవల పన్ను’ (జిఎస్‌టి) శకం ప్రారంభమైన సందర్భంగా దేశ ప్రజానీకాన్ని ఎంతగానో ఉత్తేజితం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్లమెంటును సమావేశ పరచి ఈ కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.

07/01/2017 - 00:51

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనగానే అందరూ దాన్ని ఒక ‘హిందూత్వ సంస్థ’గా భావిస్తారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న పలు అనుబంధ సంఘాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం దేశవ్యాప్తంగా నిర్వహిస్తూన్నాయి. సేవా కార్యక్రమాల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టే ఇతర అంశాల గురించి ఎక్కువమందికి తెలియదు.

06/29/2017 - 00:30

ప్రతి రాష్ట్రం తన ఆదాయాన్ని పెంచుకుంటేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు జరుగుతాయి. తగినంతగా ఆదాయం లే కుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తే లోటు బడ్జెట్ అనివార్యమవుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మారాలంటే ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా పెంచే విధంగా సరైన మార్గాలు వెతకాలి. సామాన్యునిపై భారం పడకుండా పొదుపుగా ఖర్చు చేసుకునే అలవాటు చేయాలి.

Pages