S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
నేటికాలంలో డిజిటల్ పరికరాలు ఉపయోగించని పిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అందరి పిల్లలూ ఫోన్లో ఆడే ఆటలతోనో, కంప్యూటర్ ఆటలతోనో, ప్లే స్టేషన్లతోనూ బిజీగా ఉంటున్నారు. అలాగే డిజిటల్ టెక్నాలజీ నేర్చుకోవడంలో వారు చాలా ముందుంటున్నారు. ఇది మంచి విషయమే కానీ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల కళ్లమంటలు, కళ్లపై ఒత్తిడి పడుతున్నా పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను వదిలేందుకు ఇష్టపడటం లేదు.
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో గాజులకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, పళ్ళు ముతె్తైదువుకి ఇవ్వడంలో ఎంతో విశిష్టత ఉంది. దీన్ని ఐదోతనంగా భావిస్తారు. ఇదేగాక సీమంతంలో గర్భిణీ స్ర్తిలకి, గర్భానికి కడుపు తో వున్న బిడ్డకి దిష్టి తగలకుండా ఈ గాజులు పట్టించి గాజులతన్ని సత్కరించి పేరంటాళ్ళకు గాజులు వేయిస్తారు.
మన లాంగ్ జర్నీస్లోగాని, రకరకాల టూర్స్లో హోటల్ దగ్గర దిగి లంచ్, డిన్నర్ని చెయ్యడం తప్పనిసరి. ఒక్కొక్కసారి సిటీలలో లోకల్ సైట్ సీయింగ్లు తప్పనిసరి. న్యూక్లియర్ ఫ్యామిలీస్- ఇద్దరు ఎంప్లాయిస్ అయినప్పుడు వారాంతంలో హోటల్ భోజనం ఒక ఎంజాయ్మెంట్. ఒక్కొక్కసారి అతిథులు వచ్చినపుడు, టేబుల్ బుక్ చేసి భోజనాలు పెట్టించడం సరదా.
ఎక్కడ చూసినా మహిళలపైనా దౌర్జన్యాలు. తప్పు అనేది స్ర్తీ పురుషులు చేసినా సరే శిక్ష అనుభవించేది మాత్రం మ హిళనే. శారీరకంగానే కాదు మానసికంగా శిక్ష పడేది స్ర్తి కి మాత్రమే. పూర్వకాలంలో వాడికేం మగమహారాజు అనేవాళ్లు. వాళ్లంతా చాంధసులు అని ఇపుడు అంటున్నాం. ఇది నిజమేనా ఒక్కసారి ఆలోచించండి. తప్పు అనేది ఎక్కువగా పురుషులే చేస్తున్నారు.
అప్పటి మహిళ గృహిణే. అట్లాఅని హాయగా నిద్ర పోతుండేది అనుకుంటున్నారా? అదేం కాదండి పాపం.. అపడు మహిళ ఏమేమి చేసేది అంటే పాడి పశువులు వున్న ఇల్లాలికైతే ఆ పనులన్నీ ఆమెవే.
**కుటుంబ వ్యవస్థలో ఊహించని మార్పులెన్నో వచ్చాయి. కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు. గడప దాటి బయటికి పోనిచ్చేవారు కాదు. ఇంటి పనులను, వంట పనులను నేర్పించి పెండ్లి పేరంటాలు చేసి ఎంతో కొంత కట్నం ఇచ్చి అత్తగారింటికి పంపేవారు. పెండ్లి అయిన స్ర్తి తన భర్తకు, అత్తమామలకు ఆడపడుచులకు సేవలు చేస్తూ వారిని మెప్పిస్తూ ఎంతో అణకువగా ఉండవలసి వచ్చేది.
ఏకాలంలోను ప్రేమలు అన్నీ సఫలం కావు. ప్రేమ అంటే సాధారణంగా యువతీయువకుల మధ్య ఏర్పడేవి ఇక్కడ తీసుకుందాం. సఫలం అంటే ఈ ప్రేమలు పెళ్లికి దారితీసి నూరేళ్ల పంటగాపండవు. ఎన్నో మధ్యలోనే రాలిపోతాయి. మరికొన్ని కసుగాయలుగానే ఉండిపోతాయి. పండు పండే దశలోనే కొన్ని ఆగిపోతాయి.
ఆరునెలల వయస్సు రాగానే పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని అలవాటు చేయవచ్చు. డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం మొదటి ఆరునెలల తర్వాత బిడ్డకు మరీ ఘనపదార్థాలు కాకుండా జావలాంటి ఆహారపదార్థాలను అలవాటు చేయాలి. వీటిని తల్లిపాలతో పాటు ఇవ్వాలి. వీటిని అలవాటు చేయగానే తల్లిపాలను మానేయకూడదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొన్నిసార్లు బిడ్డ ఇలాంటి పదార్థాలు తినడానికి ఇష్టపడకపోవచ్చు.
మానసిక ఇబ్బందులు పడేవాళ్లల్లో స్ర్తిలే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వే తెలుపుతోంది. ప్రతి సమస్యను కూడా స్ర్తిలు మనసుతో ఆలోచిస్తారు. ఇది ఒకందుకు మంచిదే. దాని వల్ల ఇతరులకు చెడు జరగకుండా ఉంటుంది. ఆ పనిని చేసేవారికి కూడా మనశ్శాంతిని పొందవచ్చు. గాని ఒకప్పుడు కేవలం శారీరక శ్రమ మాత్రమే ఉండేది. దాని నుండి ఉపశమనం కలిగించుకోవాలంటే తగినంత ఆహారంతో పాటు నిద్ర కూడా ఉంటే సరిపోయేది.