S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

10/21/2017 - 18:35

శివకేశవలకిద్దరికీ ప్రాణప్రదమైన మాసం కార్తికం. ఇటు కేశవుడికి సన్నజాజిపూదండలతో అర్చనాదులను చేస్తారు. అటు శివునికి జిల్లేడు మారేళ్లతో పూజ చేస్తారు. శివుడు అభిషేకప్రియుడని నిత్యాభిషేకాలు చేస్తుంటారు. ఈ పవిత్ర మాసం స్నానమునకు- దీపమునకు- దానాలకు ప్రసిద్ధియైనది. దీపదానం చేసినవారికి శివకేశవులిద్దరూ పుణ్యరాశులను అనుగ్రహిస్తారు.

10/20/2017 - 18:19

కార్తీకమాసంలోని శుక్ల పక్ష విదియకు ‘్భతృవిదియ’ అని పేరు. అపమృత్యు భయం, నరకలోక ప్రాప్తి లేకుండా చేసి స్ర్తిలకు సకల సౌభాగ్యాలు కలకాలం వర్థిల్లేలా చేసే పుణ్యదినం- భాతృవిదియ’. దీనికే ‘యమద్వితీయ’, ‘కాంతి ద్వితీయ’, ‘్భగినీ హస్త్భోజనం’ అని పేర్లు. సోదరీ, సోదరుల మధ్య అనురాగానికీ, ఆప్యాయతలకూ నిదర్శనంగా నిలిచే పండుగ రోజు- ‘్భతృవిదియ’.

10/18/2017 - 18:05

దుష్టశక్తులపై దైవీశక్తులు సాధించిన ఘన విజయ చిహ్నమే దీపావళి. ‘దీపం’ లక్ష్మీదేవి రూపం. సకల శుభాలకు, సంపదలకు చిహ్నం, దీపమే చీకట్లు పోగొట్టి సత్య దర్శనం చేయిస్తుంది. అనేక దీపాల వరసయే దీపావళి.ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాస శుక్లపక్ష అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవడం మన సంప్రదాయం.
శుభం భవతు కల్యాణి ఆరోగ్యం ధన సంపదః
మమ శత్రు వినాశాయః సంధ్యా జ్యోతిర్నమోస్తుతే

10/17/2017 - 17:51

పరమార్థంతో నిండి ఉండే పండుగల్లో దీపావళి ప్రత్యేకమైంది. అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే అంతరార్థం చెప్పేది దీపావళి. వెలుగునే భారతీయులు పరంజ్యోతి అన్నారు. అవిద్య, అజ్ఞానం, అవివేకం లాంటి చీకట్లు ఎపుడు తొలుగు తాయో అపుడు దివ్యవెలుగులు ప్రసాదిస్తాయ. ఆ దివ్య వెలుగులు ప్రసరించేవేళనే దీపావళి అని యావత్తు ప్రపంచం వెలుగును ఆహ్వానిస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు.

10/15/2017 - 21:47

అశ్వీయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశికి ‘్ధన త్రయోదశి’ అని పేరు. అపమృత్యు భయాన్ని పోగొట్టి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సకల సంపదలను ప్రసాదించే దివ్యమైన పండుగ రోజు ధనత్రయోదశి. ఇది సంపదల తల్లి అయిన శ్రీలక్ష్మీదేవికి ప్రియమైన రోజు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు.

10/14/2017 - 18:09

మానవ తనువు అజ్ఞాన మట్టితో నిర్మితమై, లోకపు పాప, పుణ్యాల జాడ ఏమిటో తెలియకుండా జన్మించినప్పటికీ, వ్యాపించియున్న అజ్ఞాన పొరలను చీల్చి, జ్ఞానమనే ప్రకాశ దీపాన్ని వెల్గించి విశ్వమంతటికీ దేదీప్యకాంతిని ప్రసరిల్లేటట్లు నాటి తొలి ఆశ్రమ గురువులు కొవ్వొత్తిలా కరుగుతూ శిష్యగణానికి మహోజ్వలమైన జ్ఞాన ప్రదీప్తిని వెదజల్లేవారు.

10/13/2017 - 17:32

సర్వేజనా సుఖినోభవన్తు అన్నది భారతీయుల భావం. నలుగురూ బాగుంటే ఆ నలుగురిలో నేను ఒకణ్ణి అనే అనుకొంటారందరూ. భారతదేశం పుణ్యభూమి. ఇందులో ఏ కర్మ చేసినా నలుగురూ బాగుండాలని సుఖసంతోషాలతో వర్థిల్లాలని అనుకోవడం వారి జీవనాడిలో ఇంకి పోయ ఉంది. వారు సంకల్పం చేసుకొన్నా లేకపోయనా కూడా సర్వజనహితమే జరగాలన్న ది వారి భావన అయ ఉంటుంది.

10/12/2017 - 18:41

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగే జీవన ప్రయాణంలో కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. జీవికి జన్మ పరంపరలు ఎలా తప్పవో అట్లానే కర్మ పరంపరలు కూడా వస్తూనే ఉంటాయ. కర్మ చేయమని భగవద్గీత చెబుతుంది. కాని ఆ కర్మఫలాలను ఆశించి చేయకపోతే అవి అతనికి అంటవని దానివల్ల అతడు మోక్షగామి కావచ్చు నని కూడా భగవద్గీతనే చెబుతుంది.

10/11/2017 - 16:52

పౌరాణిక సాహిత్యంలో భాగవతము అను పేరిట రెండు పురాణగ్రంథాలు ప్రస్తావించబడినవి. మొదటిది దేవీ భాగవము. రెండవది శ్రీమద్భాగవతము. దేవీ భాగవతము శాక్త భాగవతం గాపేర్కొనబడింది. ఇందులో శాశ్వత సనాతన ధర్మమునకు చెందిన గాధలే ఇతివత్తంగా వర్ణించబడినవి.

10/10/2017 - 18:50

కూడిన జీవితాన్ని కోరుకునే వారెవరైనా కష్టాన్ని ఇష్టపడతారు. కష్టాన్ని నిండుమనసుతో నమ్ముకుంటారు. కష్టం తర్వాత అందుకు తగిన ప్రతిఫలంగా సుఖం చేకూరుతుందని విశ్వసిస్తారు. రద్దీగా వున్న ప్రాంతంలో వాహనం సురక్షితంగా నడిపించడం కత్తిమీద సాము. ముఖ్యంగా నాలుగు అంతకుమించిన బజార్ల కూడళ్లలో సంకేతాలకు అనుగుణంగా వెళ్లడంలో ఎవరి ప్రణాళిక వారిది.

Pages