S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 02:51

మానకొండూర్, మార్చి 26: మండల పరిధిలోని కొండపల్కల గ్రామంలో శనివారం ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

03/27/2016 - 02:51

జూలపల్లి, మార్చి 26: మండలంలోని ఆదర్శ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మండలంలోని కోనరావుపేట గ్రామానికి చెందిన ఇప్పనపెల్లి పవిత్ర (15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో ఉంటు శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో పాఠశాల ఆవరణలో ఖోఖో ఆడుకుంటుండగా నీరసంగా ఉందని కూర్చుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

03/27/2016 - 02:51

డెహ్రాడూన్, మార్చి 26: కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ శనివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గోవింద్ సింగ్ కున్‌జ్వాల్‌ను కోరారు. రావత్.. స్పీకర్ కున్‌జ్వాల్‌తో భేటీ అయి తన వాదన వినిపించారు.

03/27/2016 - 02:50

కరీంనగర్ టౌన్, మార్చి 26: జిల్లాలో పనిచేస్తున్న వారితోపాటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తూ జిల్లాకు వచ్చిన 12మంది తహశీల్దార్లకు జిల్లాలో పోస్టింగ్‌లు కల్పిస్తూ శనివారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

03/27/2016 - 02:50

న్యూఢిల్లీ, మార్చి 26: యెమెన్‌లో గత నెల ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన కేరళ ఫాదర్‌ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం తెలిపారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు ఆ పూజారిని ఉరితీయాలని సదరు ఉగ్రవాద గ్రూపు నిర్ణయించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ పై విషయాన్ని స్పష్టం చేశారు.

03/27/2016 - 02:50

వేములవాడ, మార్చి 26: హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా జరిగింది.శనివారం ఉదయం 10.30గంటలకు కళ్యాణ వేడుక ప్రారంభమైంది.కళాభవన్ సమీపంలో వరుడు శ్రీ రాజరాజేశ్వరున్ని ఎదుర్కొళ్లలతో అర్చకులు కళ్యాణతంతుకు తెరలేపారు.

03/27/2016 - 02:49

చెన్నై, మార్చి 26: తమిళనాడులో వచ్చే మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె తమకు చాలా తక్కువ సీట్లు కేటాయించాలని అనుకుంటున్నట్లు వార్తలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కనీసం 45 సీట్లన్నా ఇచ్చేలా చూడాలని అనుకోవడమేకాక తమ అభిప్రాయాన్ని సీట్ల పంపిణీపై డిఎంకెతో చర్చలు జరుపుతున్న పార్టీ కేంద్ర నాయకులకు తెలియజేశారు.

03/27/2016 - 02:49

ఆకస్మిక తనిఖీ జమ్మికుంట/కమలాపూర్, మార్చి 26: జమ్మికుంట రూరల్, కమలాపూర్ పోలీసు స్టేషన్లను శనివారం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును, గార్డ్ నిర్వహణను పరిశీలించారు. క్రైం రేట్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరగా విచారణలు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్‌లు దాఖలు చేసి వేగవంతం చేయాలని సూచించారు.

03/27/2016 - 02:48

కరీంనగర్ టౌన్, మార్చి 26: గ్రూప్ 2,కానిస్టేబుల్ పోటీపరీక్షలకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు ఊరట లభించింది. పరీక్షలకు సిద్దమయ్యేందుకు గడువుసరిపోవటం లేదంటూ అభ్యర్థులు గతకొంతకాలంగా చెందుతున్న ఆందోళనకు తోడు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఏప్రిల్ 23,24 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ శనివారం ప్రకటన వెలువరించింది.

03/27/2016 - 02:48

న్యూఢిల్లీ, మార్చి 26: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది.

Pages