S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/30/2019 - 04:17

గరిడేపల్లి, ఏప్రిల్ 29: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రూ. 8వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని కుతుబిషాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవిన్యూ సిబ్బంది పట్టా చేశారు.

04/30/2019 - 04:15

కొల్చారం, ఏప్రిల్ 29: అతి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామశివారులో రంజ్య తండాకు చెందిన మాలోవత్ రమేశ్ (38), జ్యోతి (32)లు మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

04/30/2019 - 04:14

అచ్చంపేట, ఏప్రిల్ 9: తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని ఖాస్తులో ఉన్నా తమకు కాదని ఇతరులకు బదాలాయించారని ఆరోపిస్తూ ఓ రైతు ఆర్టీఓ కార్యాలయంలో జాయంట్ కలెక్టర్ సమక్షంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సోమవారం సంచలనం స్పష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..

04/30/2019 - 03:37

సబ్బవరం, ఏప్రిల్ 29: విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం జరిగిన ఈ సంఘటనను ఇక్కడి వర్శిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ శ్రీ సుధ, స్థానిక సీఐ ఎం. శ్రీనివాసరావు విలేఖరులకు ధ్రువీకరించారు.

04/30/2019 - 02:43

నెల్లూరు, ఏప్రిల్ 29: సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ నివ్వాల్సిన రక్షణ భటులే చోరీకి పాల్పడ్డారు. ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి రూ.50లక్షలు అపహరించి చివరకు పోలీసులకు చిక్కారు. పట్టుబడిన పోలీస్ సిబ్బందిలో ఒకరు ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి ఉండడం విశేషం.

04/30/2019 - 02:31

హైదరాబాద్, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల సమయంలో డబ్బుల వ్యవహారంలో నోటీసులు ఇచ్చేందుకు వెళితే పోలీసులను నిర్బంధించిన కేసులో విశే్వశ్వరరెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించగా నాంపల్లి కోర్టు పిటీషన్‌ను గురువారం నాడు కొట్టివేసింది.

04/30/2019 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రాఫెల్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం దీనికి సంబంధించి తాజాగా మరో అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు. కాపలాదారుడే దొంగ అన్న తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, సుప్రీం తీర్పును వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

04/30/2019 - 01:37

కంకిపాడు, ఏప్రిల్ 29: స్థానిక చెరువుకట్టపై నివసించే టీటీసీ విద్యార్థిని ఈనెల 27న అదృశ్యమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం స్థానికురాలైన 19ఏళ్ల యువతి అంగలూరులో టీటీసీ శిక్షణ పొందుతోంది. ఈనెల 27న సాయంత్రం గ్రామంలోని ఓ టైలర్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ వి షయమై రాణి స్నేహితులను, బంధువుల ను తల్లిదండ్రులు ఆరా తీశారు.

04/30/2019 - 01:37

పెనమలూరు, ఏప్రిల్ 29: జిల్లాలో నాణ్యతా ప్రమాణాలు లోపించిన, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐస్‌క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, విజిలెన్స్ ఏడీ శ్రీనివాసరావు చెప్పారు.

04/30/2019 - 01:12

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 29: విహారయాత్రకు వెళ్లిన ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి 15 తులాల బంగారు అభరణాలు దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీకాలనీ సర్దార్ పటేల్‌నగర్ అనుశ్రీ హైట్స్‌లో నివాసం ఉంటున్న ముర్రపు నాగేశ్వర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లారు.

Pages