S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/01/2019 - 04:28

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్‌రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇప్పటికిపుడు అత్యవసరంగా ఈ పిటీషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

05/01/2019 - 03:28

హైదరాబాద్, ఏప్రిల్ 30: పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించ తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాసభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మే 8వ తేదీన ఇందిరాపార్కు వద్ద అంబేద్కర్ వాదుల గర్జన నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ హైకోర్టుకు తెలిపింది.

05/01/2019 - 03:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కార కేసులో మరో అఫిడవిట్‌ను సమర్పించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అవకాశమిచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులో ఇటీవలి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే.

05/01/2019 - 03:23

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరుకావల్సిందేనంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు స్పష్టం చేసింది. బెస్టు అండ్ క్రాంప్టన్ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులను సుజనా చౌదరి హైకోర్టులో సవాల్ చేశారు. సుజనా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సుజనాకు ఊరట కలిగించేలా న్యాయమూర్తులు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

05/01/2019 - 03:22

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 30: నగరంలోని సింహపురి హాస్పటల్‌లో బలవంతంగా అవయవాలు తీసుకుంటున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి విచారణలో తేలింది. ఈనేపథ్యంలో ఆ హాస్పటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయవల్సిందిగా నెల్లూరు రూరల్ పోలీసులకు ఆమె మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

05/01/2019 - 02:48

పెద్దవూర, ఏప్రిల్ 30: నల్లగొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 64లక్షల రూపాయలు నగదును పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన కులిజాల పూర్ణయ్య దేవరకొండ నుండి మిర్యాలగూడకు ఏపీ 24ఏయూ 6606 కారులో నగదుతో వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ నగదుకు ఎలాంటి ఆధారాలు ఇవలేదని ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు.

05/01/2019 - 02:56

మహదేవ్‌పూర్: తన తండ్రి మృతి చెందగా పట్టా మార్పిడి కోసం కార్యాలయానికి వెళితే లంచం కోసం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారులను బాధితుడు ఏసీబీకి పట్టించిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

05/01/2019 - 02:42

ఇటిక్యాల, ఏప్రిల్ 30: జమ్ములమ్మ దైవదర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు తరలిపోయన సంఘటన గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని కోదండాపురం జింకలపల్లి స్టేజి మధ్యలో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై సీహెచ్ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

05/01/2019 - 02:33

గణపురం, ఏప్రిల్ 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులిద్దరూ విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయ. చెల్పూరు గ్రామానికి చెందిన నడిగొట్టు రాజయ్య (55), నడిగొట్టు రాజు (25) తండ్రీ కొడుకులు.

05/01/2019 - 02:27

భువనగిరి, ఏప్రిల్ 30: పట్టణంలోని హనుమాన్‌వాడలో నివాసముంటున్న రేపాక నాగరాజు తన భార్య కవిత (31)ను బండరాయితో మోది చంపేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగరాజుకవితలకు 14సంవత్సరాల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలు వంశీ 6వ తరగతి, కూతురు మూడవ తరగతి విద్యనభ్యసిస్తున్నారు. వీరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తరచు గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలియజేసారు.

Pages