-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
భువనగిరి, మే 1: రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన మానవమృగం, సైకో శ్రీనివాస్రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి టీ.నాగరాణి ముందు హాజరుపర్చి జడ్జి ఆదేశాల మేరకు వరంగల్ జైలుకు తరలించారు. వరుస హత్యలకు పాల్పడ్డ మర్రి శ్రీనివాస్రెడ్డిని బొమ్మలరామారం పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చిన అనంతరం భారీ పోలీసు బలగాల పహారా మధ్య వరంగల్ జిల్లా జైలుకు తరలించారు.
ఇబ్రహీంపట్నం, మే 1: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం జూపూడి గ్రామంలో జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసుల సమాచారం ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కోదాడలోని ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తుండగా జూపూడి గ్రామం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
హైదరాబాద్, మే 1: మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని నగర ట్రాఫిక్ పోలీసలు హెచ్చరికలు చేస్తున్న మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా గడిచిన ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో మొత్తం 2282 మందిపై కేసులు నమోదయ్యాయి.
జీడిమెట్ల, మే 1: ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి యువకుడు మృతిచెందిన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బీహార్కు చెందిన ఎండీ శమీమ్ (24) కూలీ పనులు చేస్తుంటాడు. గండిమైసమ్మలోని ఎండీ యూనస్ పంచర్ దుకాణంలో కూలీగా పనిచేస్తాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన శమీమ్ ఇనుప వాటర్ డ్రమ్పై నిలబడి సబ్బు తీసుకునేందుకు వెతుకుతున్నాడు. కాలు జారి కిందపడిపోయాడు.
జీడిమెట్ల, మే 1: సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు క్వారీ కుంటలో మునిగి గల్లంతైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ కైసర్ నగర్, రాజన్నబస్తీలో నివాసముండే అబ్దుల్ సలీమ్ డ్రై క్లీనింగ్ దుకాణం నడుపుతుంటాడు. అతని కుమారుడు ఇబ్రాన్(15) ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు.
షాద్నగర్ రూరల్, మే 1: ప్రజల శ్రేయస్సుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి వివరించారు. బుధవారం తెల్లవారుఝామున రెండు గంటల సమయంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్నగర్ ఏసీపీ సురేందర్, స్థానిక సీఐ శ్రీ్ధర్ కుమార్ ఆధ్వర్యంలో షాద్నగర్ పురపాలక సంఘం పరిధిలోని ఫరూఖ్నగర్ ప్రాంతంలోని పాత ఆశియానా హోటల్ వెనుక ప్రాంతంలో 400 ఇళ్లను తనిఖీ చేశారు.
హైదరాబాద్, మే 1: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు మనుమరాలిని ఆయన కోడలు సింధుశర్మకు అప్పగించే వ్యవహారం హైకోర్టుకు చేరింది. పెద్దకుమార్తె రిషిక కోసం రామమోహనరావు కోడలు సింథుశర్మ హైకోర్టును ఆశ్రయించారు. కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సింధుశర్మ హెబియస్ కార్పస్ పిటీషన్ను దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్పై హైకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది.
బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామశివారులో మంగళవారం ఆర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా మృతి చెందాడు.
సంగారెడ్డి, మే 1: పోలీసు శాఖలో పని చేస్తున్న మగ, ఆడ కానిస్టేబుళ్ల మధ్య ఏర్పడిన ప్రేమ వివాహానికి దారి తీయడంతో కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేసి, శవంపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పూణె, మే 1: మహారాష్ట్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛకాన్ జిల్లాలోని ఖాలుబ్రేలో మూడు మోటర్ సైకిళ్లపై ఎస్యూవీ దూసుకుపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఫేబ్రికేషన్ యూనిట్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు మూడు మోటర్ బైక్లపై ఇళ్లకు వస్తున్నారు.