-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పరిగి, ఫిబ్రవరి 28: తాళం వేసిన ఐదు ఇళ్లలో దొంగ తనం జరిగిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బసిరెడ్డిపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. బసిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు వేసిన ఐదు ఇళ్లలో దొంగతనం చేశారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉబ్బరం ఉండటంతో ఇంటికి తాళం వేసి స్లాబ్పై పడుకున్నారు. ఒకరిద్దరు వ్యక్తులు తమ బంధువుల ఇంటి దగ్గర పెళ్లి గురించి వెళ్లారు.
ఉప్పల్, ఫిబ్రవరి 28: ఉప్పల్ బస్టాండ్ సమీపంలోని వీటీ కమాన్ రేణుకా ఎల్లమ్మ కిరాణ జనరల్ స్టోర్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 45 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహంపై పచ్చని రంగు జాకెట్ ధరించి ఉందని అన్నారు. అనుమానాస్పదస్థితిలో మరణించిన మహిళ మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.
జీడిమెట్ల, ఫిబ్రవరి 28: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బౌరంపేట గ్రామం ఇందిరమ్మ కాలనీలో నివాసంఉంటూ చండీశ్వర్(62) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా నేను చనిపోతానని కుటుంబ సభ్యులతో తరచు అం టుండేవాడు. రెండు నెలల క్రితం తన భార్య గుండె పోటుతో మృతిచెందగా అప్ప టి నుంచి భర్త చండీశ్వర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఘట్కేసర్, ఫిబ్రవరి 28: తాగుడుకు బానిసైన వ్యక్తి గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గానగర్లో నివాసం ఉంటున్న టంటం భిక్షపతి (55) తాగుడుకి బానిసైనట్లు తెలిపారు. కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు చెప్పారు.
ఉప్పల్, ఫిబ్రవరి 28: ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ గోవిందరావుపేట చాల్వాయి గ్రామానికి చెందిన వెంగాల రంగయ్య(80) హైదరాబాద్ రామంతాపూర్లో నివసిస్తున్న కుమారుడు రమేశ్ వద్దకు ఈనెల 26న ఆర్టీసీ బస్సులో వచ్చి ఉప్పల్ బస్టాండ్లో దిగాడు. రామంతాపూర్కు వెళ్లే బస్సు ఎక్కి ఎక్కడ దిగాడో తెలియదు కానీ ఇంటికి వెల్లకుండా అదృశ్యమయ్యాడు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: రెండు వారాలలోగా దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఒక పాకిస్తాన్ మహిళను ఆదేశించింది. చట్ట ప్రకారం భారత్లో ఉండటానికి వీలు లేదని, అందువల్ల భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విభు బఖ్రు కొట్టివేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తమిళనాడులో జయలలిత వర్గం నేతలు శశికళ, టీటీవీ దినకరన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఏఐఏడీఎంకే పార్టీ, ఎన్నికల గుర్తు రెండాకులు తమకే ఇప్పించాలన్న అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న పళనిస్వామి వర్గానికే అన్నాడీఎంకే, రెండాకుల గుర్తు చెందుతాయని కోర్టు ప్రకటించింది. 2017 నవంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది.
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 27: ఓ వ్యాపారి నుంచి రూ.20 వేలు లంచం తీసుకున్న కర్నూలు నగర పాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) శాస్ర్తీ షబ్నంను ఏసీబీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు, ఫిబ్రవరి 27: నగరంలో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగుచూసింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక నేతాజీనగర్లో డక్కిలి వసంతకుమారి అనే మహిళ ఒంటరిగా నివసిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగిగా రిటైర్ అయిన ఆమె అవివాహిత కావడంతో ఒంటరిగానే నేతాజీనగర్లోని తన స్వగృహంలో నివసిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఫిబ్రవరి 22వ తేదీ తరువాత కాశ్మీరీలపై దాడి జరగలేదని కేంద్ర ప్రభుత్వం తెలియచేసినందున ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.