S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/20/2020 - 12:41

న్యూఢిల్లీ: నాకుమార్తెకు ఇపుడు న్యాయం జరిగింది. ఆలస్యం జరిగినా న్యాయమే గెలిచిందని నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, భద్రినాథ్ సింగ్ అన్నారు. నిర్భయ దోషులను తీహార్ జైలులో ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీసిన విషయం విదితమే. ఉరి అమలుపై నిర్భయ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఉరుకునేది లేదని అన్నారు.

03/20/2020 - 12:39

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 195కు నమోదు అయ్యాయి. వీరిలో 32మంది విదేశీయులు కాగా 163 మంది భారతీయులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్టల్రలో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు. అత్యధికంగా మహారాష్ర్టలో 47 కేసులు నమోదు అయ్యాయి. ఇందుల్లో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. రెండో స్థానంలో కేరళ నిలిచింది.

03/20/2020 - 12:38

న్యూఢిల్లీ: ఎట్టకేలకు నిర్భయ దోషులను ఉరితీశారు. తీహార్ జైలులు ఈ రోజు ఉదయం 5.30 గంటలకు దోషులు నలుగురు ఉరికంబానికి వేలాడారు. నలుగురు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ ఠాకూర్ (31), పవన్‌గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేష్ సింగ్ (32) దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు, పటియాలా, సుప్రీం కోర్టు కొట్టివేయటంతో ఉరి శిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

03/20/2020 - 00:47

న్యూఢిల్లీ, మార్చి 19: నిర్భయకు ప్రత్యక్ష నరకాన్ని చూపించిన నలుగురు మృగాళ్లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్దమైంది. నలుగురు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ ఠాకూర్ (31), పవన్‌గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేష్ సింగ్ (32) దాఖలు చేసిన అన్ని పిటిషన్లను పటియాలా కోర్టు కొట్టివేయటంతో ఉరి శిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

03/20/2020 - 00:40

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా వైరస్‌తో పోరాడేందుకు వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించడం ద్వారా దేశమంతా స్వచ్ఛంద ‘లాక్ డౌన్’ను ప్రకటించింది. కరోనా మూలంగా రానున్న ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు.

03/20/2020 - 00:37

న్యూఢిల్లీ: నావల్ కరోనా వైరస్ లేదా కోవిడ్-19 విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలను గురువారం ప్రకటించింది. ఇప్పటికే తీసుకున్న చర్యలకు తోడుగా తాజాగా మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
65 సంవత్సరాలు నిండిన వృద్ధులు తమ ఇళ్లల్లోనే ఉండాలి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్

03/19/2020 - 17:15

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు రేపు ఉరిశిక్ష అమలుకానున్నది. తెల్లవారుజామున ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా దోషులలో ఒకరైన పవన్‌గుప్తా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ ఉదయం ఆ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ నలుగురు దోషులు కూడా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు.

03/19/2020 - 17:15

షిల్లాంగ్: పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మేఘాలయలో కరోనా వైరస్ ప్రభావం పడింది. అక్కడి పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు తమ పర్యాటక షెడ్యూల్‌లో మార్పు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం కోరింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. ఆ తరువాత పరిస్థితులను బట్టి మార్పు చేస్తామని తెలిపింది.

03/19/2020 - 13:21

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బుధవారం నాటికి 158గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం 10 గంటల వరకు ఆ సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు.

03/19/2020 - 13:16

ముంబయి: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ఈరోజు ఉదయం చేరుకున్నారు. యెస్ బ్యాంకుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించనున్నారు. మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి యెస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్‌తో పాటు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది.

Pages