S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/18/2020 - 23:48

చెన్నై, మార్చి 18: కరోనా వైరస్ మహామ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. కరోనా వ్యాధిని ఎదుర్కొవడానికి అన్ని చర్యలు చేపట్టాయి. ప్రపంచ దేశాలను ఈ మహామ్మారి వణికిస్తున్నది. వివిధ దేశాల నుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాయి.

03/18/2020 - 16:48

న్యూఢిల్లీ: కరోనా కేసుల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ గంటలోనే కేసుల తాజా పరిస్థితిని వివరిస్తున్నామని అన్నారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించాలని, కేవలం పరీక్షల కోసం పరీక్షలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు.

03/18/2020 - 17:29

న్యూడిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిలో భాగంగా దేశంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని సూచనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

03/18/2020 - 16:46

శ్రీనగర్: వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. వైష్ణోదేవి దర్శన యాత్రను రద్దుచేసుకోవాలని ఆలయ బోర్డు సైతం విజ్ఞప్తిచేసింది. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్‌కు రాకపోకలు సాగించే అన్ని అంతరాష్ట్ర బస్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు జమ్మూకాశ్మీర్ యంత్రాంగం తెలిపింది.

03/18/2020 - 16:45

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరులోని ఓ హోటల్ ముందు ఈరోజు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ హోటల్‌కు చేరుకుని తమ ఎమ్మెల్యేలను కలుస్తానని అనటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ అభ్యర్థిని ఈనెల 26న ఎన్నిక జరుగుతుంది. మా ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది.

03/18/2020 - 13:25

న్యూఢిల్లీ: భారత సైన్యంలో ఒకరికి కరోనా సోకింది. ఈ మేరకు సైనికవర్గాలు నిర్థారించాయి. లద్దాఖ్‌లోని స్కౌట్స్ దళానికి చెందిన సైనికునికి ఈ వైరస్ సోకటంతో అతని కుటుంబాన్ని క్వారైంటైన్‌లో ఉంచారు. గత కొన్ని రోజుల క్రితం ఈ సైనికుని తండ్రి తీర్థయాత్రల కోసం ఇరాన్ వెళ్లారు. ఆయన భారతదేశానికి తిరిగివచ్చిన తరువాత క్వారైంటైన్‌లో ఉన్నారు.

03/18/2020 - 13:24

న్యూఢిల్లీ: ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా ఆరువారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్రంలో విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

03/18/2020 - 13:23

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య 147కు చేరుకుంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అలాగే ఈ కరోనా మహారాష్టల్రో తీవ్రస్థాయిలో ఉంది. పూణెలో 28 సంవత్సరాల యువతికి కరోనా నిర్థారణ అయినట్లు కలెక్టర్ నావెల్ కిశోర్ వెల్లడించారు. మహారాష్టల్రో 49 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన 147మందిలో ముగ్గురు మరణించగా, 14 మంది కోలుకున్నారు.

03/18/2020 - 01:48

న్యూఢిల్లీ, మార్చి 17: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సునామి లాంటిది, ఇది మన ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయబోతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా ముంచుకుని వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

03/18/2020 - 01:45

న్యూఢిల్లీ, మార్చి 17: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి శ్రీరామునికి చెందినదేనని తీర్పునిచ్చి సంచలనం సృష్టించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ నామినేషన్ అత్యంత వివాదాస్పదమైంది.

Pages