S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/17/2020 - 12:41

ముంబయి: కరోనా వైరస్ సోకిన కేసులు మహారాష్టల్రో అత్యధికంగా నమోదు అయ్యాయి. దాదాపు ఇక్కడ 39 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ప్రధాన నగరమైన నాగపూర్‌లో 144 సెక్షన్ విధించారు. కరోనాపై సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క పట్టణాన్ని నిర్బంధంలో ఉంచలేమని అన్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేవాలయాలు, చర్చిలకు గుంపులుగా వెళ్లవద్దని సూచించారు.

03/17/2020 - 12:40

న్యూఢిల్లీ: అమెరికాలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయన కరోనాపై మాట్లాడుతూ రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చని అన్నారు. కాని ఈ పరిస్థితులను అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. విమానయాన సర్వీసులను నిలిపివేయటంతో ఆ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రంగాన్ని ఆదుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.

03/17/2020 - 12:40

ముంబయి: షిరిడీ ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 125 కరోనా కేసులు నమోదు కాగా ఒక మహారాష్టల్రోనే 39 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా షిరిడీ ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఎవ్వరూ కూడా దర్శనానికి రావద్దని, భక్తులు తమ ప్రయాణాలను రద్దుచేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.

03/17/2020 - 12:39

న్యూఢిల్లీ: తన సస్పెన్షన్ సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ మంగళవారంనాడు తీర్పు వెలువరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెన్షన్ చేసింది. తన సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ ఆయన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

03/17/2020 - 12:39

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటి వరకు ముగ్గురు కరోనా సోకి మృతిచెందారు. మహారాష్టల్రో 64 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి చనిపోయినట్లు నిర్థారించారు. ఇతను ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలావుండగా ఈ వ్యాధి సోకి మృతిచెందిన ఇద్దరిలో ఒకరు ఢిల్లీకి చెందినవారు కాగా, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

03/17/2020 - 06:49

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పేరిట శాసన సభను వాయిదా వేసి పది రోజుల పాటు బలపరీక్ష నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ సోమవారం సాయంత్రం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. శాసన సభలో మంగళవారంలోగా బలపరీక్ష జరపకపోతే మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందంటూ గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం సాయంత్రం లేఖ రాశారు.

03/17/2020 - 01:48

న్యూఢిల్లీ, మార్చి 16: ప్రపంచ మహమ్మారిగా తయారైన కరోనావైరస్ ఆంక్షలు దేశ రాజధాని ఢిల్లీలోనూ మొదలయ్యాయి. ఎక్కడా 50మందికి మించి గుమిగూడడాన్ని ఈనెల 31వ వరకు నిషేధించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.

03/17/2020 - 01:46

న్యూఢిల్లీ, మార్చి 16: ‘లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నా హక్కును హరించారు, అనుబంధ ప్రశ్న వేయడానికి వీల్లేదన్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారించిన తీరు పట్ల తనకు ఎంతో బాధ కలిగిందని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

03/17/2020 - 01:59

న్యూఢిల్లీ: మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సాంకేతిక పరిజానంతో కూడిన పరిష్కారాలను సూచించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు తమ సాంకేతిక పరిజానంతో కూడిన పరిష్కారాలను ‘మై గవర్నమెంట్ ఇండియా’లో పొందుపరచాలని సూచిస్తూ ప్రధాని మోదీ సోమవారం ట్వీట్ చేశారు.

03/16/2020 - 16:56

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించినవారి బాధితుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం అందజేయనున్నట్లు బీహార్ సీఎం నితిశ్‌కుమార్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. బీహార్‌కు వచ్చే ప్రయాణీకుల వైద్య పరీక్షల కోసం 49 స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

Pages