S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/23/2020 - 01:46

ముంబయి, మార్చి 22: దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఆదివారం ఏడారిని తలపించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపునకు ముంబయి ప్రజలు అనూహ్యంగా స్పందించారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఎప్పుడు జనసమ్మర్ధంతో ఉండే ముంబయిలోని అనేక ప్రాంతాలు ప్రజల సందడి లేక నిశ్శబ్దం రాజ్యమేలింది.

03/23/2020 - 01:44

న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటి క్యాంపస్ బయట గల ఖాళీగా ఉన్న ‘నిరసన ప్రదేశం’పైకి ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పాటు పెట్రోల్ బాంబు విసిరాడు. యూనివర్శిటి అధికారులు, విద్యార్థులు ఈ విషయం తెలిపారు.

03/23/2020 - 06:45

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరోనా మహమ్మారిపై త్వరగా విజయం సాధించాలని భారత్‌లో చైనా రాయబారి సన్ వెయిడాంగ్ ఆదివారం ఆకాంక్షించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో తమ సేవలు అందించిన వారికి అభినందనలు.

03/23/2020 - 06:48

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అన్ని రాష్ట్రాలూ నిర్ధిష్ట సంఖ్యలో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం దేశ ప్రజలు పెద్ద ఎత్తున జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

03/23/2020 - 01:41

ముంబయి, మార్చి 22: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమిగూడ వద్దని ఆయన సూచించారు.

03/23/2020 - 01:35

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రాణాంతక కరోనాపై పోరాడుతున్న యోధులకు యావత్ భారతం చప్పట్లు, తాళాలతో ఘనంగా అభినందనలు తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సాయంత్రం 5 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు యావత్ భారతం కోటాను కోట్ల మంది చప్పట్లతో మార్మోగింది. ఎవరికి తోచిన రీతిలో వారు దేశ వైద్య సిబ్బందికి, అత్యవసర సేవలందిస్తున్న వారికి స్పూర్తినందించే రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/23/2020 - 01:33

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. భయానక కరోనా వ్యాప్తి చెందకుండా పలు రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో ‘లాక్ డౌన్’ ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తిరిగే అంతర్ రాష్ట్ర బస్సులు, ప్యాసింజర్ రైళ్లు, మెట్రో సర్వీసులను ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.

03/23/2020 - 01:31

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిన సంఖ్య ఆదివారం నాటికి 341కి చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించడంతో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో ఒక వ్యక్తి ఈ వైరస్‌తో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

03/23/2020 - 01:04

న్యూఢిల్లీ/ముంబయి: ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై ఓ ఆదర్శనీయ సందేశాన్ని అందించారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలన్న సందేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించారు.

03/22/2020 - 04:51

న్యూఢిల్లీ: సార్క్ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు విశేష స్పందన వస్తోంది. తాజాగా మాల్దీవులు, భూటాన్, నేపాల్ ప్రభుత్వాలు కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధికి భారీ ఎత్తున నిధులు అందించాయి. ఈ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Pages