సమాజ్వాదీ పార్టీలో మళ్లీ లుకలుకలు
Published Monday, 12 December 2016లక్నో, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకోసం ఆ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు శివ్పాల్ యాదవ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా అధికార పార్టీలోని లుకలుకలను మరోసారి తెర మీదికి తీసుకొచ్చింది. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ సోదరుడితోపాటు మరో మాఫియా డాన్ అతీక్ అహ్మద్ లాంటి వారికి ఈ జాబితాలో చోటు కల్పించడాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుండటమే ఇందుకు కారణం.