అమెరికాలోని ఏపీ విద్యార్థులను స్వస్థలాలకు రప్పించండి
Published Tuesday, 14 April 2020విజయవాడ, ఏప్రిల్ 13: దేశం కాని దేశం అమెరికాలో గడచిన నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పడుతున్న కష్టాలను ఇప్పటికైనా గుర్తించి స్వస్థాలకు రప్పించే విషయంలో తక్షణం దృష్టి నిలపాలని కోరుతూ టీడీపీఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి పారిశ్రామికవేత్త కె బుచ్చిరాంప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా సృష్టిస్తున్న ప్రళయాన్ని కళ్లారా చూస్తున్నామంటూ, ఈ విపత్కర సమయంలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులను రక్షించడంలో, వారికి సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.