కరోనా రహిత మన్యం!
Published Tuesday, 14 April 2020పాడేరు, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కరోనా వైరస్ విశాఖ మన్యం దరి చేరలేదు. కరోనాను కట్డడి చేసేందుకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఈ భయంకర రక్కసి గిరిజన ప్రాంతంలో అడుగు పెట్టకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ, విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడే విశాఖ మన్యం ప్రాంతంలో కరోనా వైరస్ సునాయాసంగా సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఈ ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించిన ప్రాజెక్టు అధికారి బాలాజీ సకాలంలో పకడ్బందీ చర్యలు తీసుకుని కరోనా నుంచి మన్యాన్ని కాపాడడంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.