మొక్కల నాటి సంరక్షించండి
Published Monday, 4 July 2016విజయనగరం (్ఫర్టు), జూలై 3: మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే గీత కోరారు. పట్టణంలో పూల్బాగ్లో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ మొక్కలను నాటితే సరిపోదని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయాలం టే మొక్కలను నాటాలని కోరారు. వాటి పెంపకంపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. విజయనగరం పట్టణంతోపాటు రూరల్ మండలంలో కూడా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.