నగదు రహిత ప్రజా పంపిణీ
Published Sunday, 15 May 2016విజయవాడ, మే 14: భారతదేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో నగదురహిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రధాన మంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ప్రియాంక మహిళ గ్రూప్ సభ్యులు నడుపుతున్న చౌకధరల దుకాణంలో తెల్లకార్డుదారు ఇంట రవికుమార్కు 25కిలోల బియ్యాన్ని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండేతో కలసి నగదు రహిత విధానంలో అందజేశారు.