కల్యాణలక్ష్మీ లబ్ధిదారులను విచారించిన ఏసిబి
Published Sunday, 1 May 2016కీసర, ఏప్రిల్ 30: కీసర మండలంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులను ఎసిబి అధికారులు శనివారం విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పక్కదారి పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎసిబి డిఎస్పి ప్రభాకర్ కీసర, నాగారం, దమ్మాయిగూడ, నర్సంపల్లి, కుందన్పల్లి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. 16 మంది లబ్ధిదారులను విచారించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేయటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పథకాలును తప్పుతోవ పట్టించేవారు ఎంతటి వారైనా సహించేది లేదని అన్నారు.