S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాలంటే ఇష్టం

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు సూర్య. చేస్తున్న ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘24’. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 6న తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా సూర్యతో ఇంటర్వ్యూ..
‘24’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
ఈ టైటిల్ ఏమిటనే విషయంపై చాలామందికి క్యూరియాసిటీ వుంది. అదేంటో తెలియాలంటే ఈనెల 6 వరకూ ఆగాల్సిందే.
సైన్స్ ఫిక్షన్ కథంటున్నారు?

- శ్రీ

సాయిధరమ్ కొత్త చిత్రం ప్రారంభం

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశాన్ని హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో చిత్రీకరించారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వి.వి.వినాయక్ తొలి క్లాప్‌నిచ్చారు. శ్రీనువైట్ల తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

8న ఒక్క అమ్మాయి... ఆడియో

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్ స్టైల్‌గా కనిపిస్తారని, ఈ సినిమాకు సంబంధించిన పాటల సీడీని ఈనెల 8న విడుదల చేయనున్నామని తెలిపారు. కథాబలం వున్న సినిమాలలో నటించే నిత్యామీనన్ తమ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు.

మంచి సందేశమిచ్చే బిచ్చగాడు

తమిళంలో విజయవంతమైన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా పతాకంపై చదలవాడ పద్మావతి అనువదిస్తున్నారు. విజయ్ ఆంటోని, సత్య టైటస్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయసుధ ఆడియోను విడుదల చేసి తొలి కాపీని విజయ్ ఆంటోనికి అందజేశారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, ఓ మంచి సందేశం వున్న సినిమాగా ఈ చిత్రం ట్రైలర్ చూశాక అర్థమైందని, తమిళంలో తాను ఈ చిత్రం చూడలేదని, తన సుపుత్రుడు తమిళంలో చాలా బాగుందని, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సినిమాలో పండిందని చెప్పాడని ఆమె తెలిపారు.

లవ్ మిస్సైల్ ఎక్కడ?

రాజ్ విరాట్ కథానాయకుడిగా రెయిన్‌బో పిక్చర్స్ పతాకంపై రాజేష్‌కుమార్.బి. దర్శకత్వంలో జి.కె.ఆర్, రాజేంద్ర సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ మిస్సైల్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం మణికొండ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్‌కుమార్.బి. మాట్లాడుతూ, సమాజంలో వున్న ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఫోబియా వుంటుందని, అటువంటి ఏ ఫోబియా లేని వ్యక్తి జీవితం ఎలా వుంటుందని అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని తె పారు. ఈ నెల 11 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వైజాగ్ అరకు ప్రాంతాల్లో షెడ్యూల్స్ నిర్వహించనున్నామని తెలిపారు.

పవన్ అతిథిగా అ..ఆ ఆడియో

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 2న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా సూర్యదేవర రాధాకృష్ణ మాట్లాడుతూ, మిక్కి జె మేయర్ అందించిన సంగీతం ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆమె.. అతడైతే!

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యం నుండి పట్టణానికి వచ్చిన ఓ కుర్రాడు తన లక్ష్యంకోసం ఎలా శ్రమించాడు, చివరికి ఎలా సాధించాడు అనే కథాంశంతో ఫుల్ లెంగ్త్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, కథకి ఖచ్చితంగా సరిపోవడంతో ఆ పేరునే నిర్ణయించామని తెలిపారు.

ఇక అమీతుమీ!

‘ఐ’ చిత్రంతో పరుగులో వెనకపడిన అమీ జాక్సన్ ఇక అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటోంది. ‘ఐ’ చిత్రం శంకర్ దర్శకత్వంలో విడుదలైనపుడు ఆ చిత్రంతో తనకు అవకాశాలు బాగా వస్తాయని ఆశించింది. కానీ ఆ చిత్రం అనుకున్నంత విజయం పొందకపోవడం అమీకి మైనస్‌గా మారింది. అందుకే తాజాగా ఎప్పటికప్పుడు తన సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లలో సంచలనాలు రేపే ఫొటోలను పెట్టి బాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. ఆమె ఫొటోలకోసం తదితర నెట్‌వర్క్‌లను వీక్షించే ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే వుందట. అందుకే ఇక ముంబయిలోనే తిష్టవేసి అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటోంది అమీ జాక్సన్.

నిర్వాసితులను రెచ్చగొట్టొద్దు: మంత్రి దేవినేని

విశాఖ: ప్రాజెక్టులు పూర్తయితే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందన్న కక్షతో వైకాపా అధినేత జగన్ పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎపి మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ యత్నించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.

పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలొద్దు: హరీష్

హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం ప్రాజెక్టులను బలిచేయరాదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎపి సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్ బాటలోనే జగన్ ప్రయాణిస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Pages