S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/18/2016 - 16:39

హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్‌లో వంద మసీదుల్లో, తెలంగాణ జిల్లాల్లో 95 నియోజకవర్గ కేంద్రాల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విందు సందర్భంగా రెండు లక్షల మంది పేద ముస్లింలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తారు. నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఆరువేల మందికి విందు ఇస్తారు.

06/18/2016 - 16:39

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్ల రూపాయలతో ఉడాయించి పోలీసులకు పట్టుబడిన నకిలీబాబా శివానందను శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. శివానందతో పాటు ఆయన అనుచరులిద్దరినీ ఈనెల 28 వరకూ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

06/18/2016 - 16:38

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన విధానాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నాయని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఆయన శనివారం నగర శివారులోని ఆదిభట్ల వద్ద టాటా-బోయింగ్ ఏర్‌స్పేస్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతికి కేంద్రం అన్ని విధాలా స్నేహహస్తం అందిస్తుందన్నారు.

06/18/2016 - 16:37

రేపు కూకట్‌పల్లిలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

06/18/2016 - 13:45

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌-ఆదిభట్లలో టాటా-బోయింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, టాటా-బోయింగ్‌ సంస్థ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

06/18/2016 - 13:39

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్లలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ టాటా-బోయింగ్‌ ఏరోస్పేస్‌ సంస్థ యూనిట్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో 3 నెలల్లో ఏరోస్పేస్‌ యూనిట్‌ పూర్తికానుంది.

06/18/2016 - 13:12

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.

06/18/2016 - 13:06

కరీంనగర్‌ : గోదావరిఖని ఇంక్‌లైన్‌ కాలనీలో శివారులోని నీటి గుంటలో పడి శనివారం ఉదయం ఇద్దరు చిన్నారులు మోహిస్‌(8), తల్మాన్‌(8) మృతి చెందారు. ఇంక్‌లైన్‌ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

06/18/2016 - 12:32

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నాయకులతో శనివారం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తెరాసలోకి వలసలు, భవిష్యత్ కార్యక్రమాలపై ఆయన చర్చించారు. టి.టిడిపి నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

06/18/2016 - 12:31

హైదరాబాద్: కూరగాయలు, ఇతర నిత్యావసర సరకుల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో శనివారం ఉదయం ఇక్కడ మార్కెటింగ్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Pages