-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
మహబూబ్నగర్: జడ్చర్లలోని ఓ పారిశ్రామికవాడలో ఎర్రచందనం దుంగలను దాచేస్తూ ప్రహరీ గోడ నిర్మించటం సంచలనం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం పోలీసులు ఆ ప్రహరీ గోడను బద్దలు కొట్టి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలల క్రితమే ప్రహరీ గోడను నిర్మించినట్లు, ఎర్ర చందనం స్మగ్లింగ్కు సంబంధించి అన్ని వివరాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: హెచ్సియులో దళిత విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థులు బంద్ పాటిస్తున్నారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరించారు. ఓయుతోపాటు పలుచోట్ల ర్యాలీని నిర్వహించి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓయులో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్ నగరం మతతత్వ శక్తులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. మంగళవారం సైదాబాద్ డివిజన్లో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. బీఫ్ కావాలంటే మజ్లిస్ పార్టీకి ఓటు వేయాలని అనడం దుర్మార్గమైన చర్య అని ఆయన విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణలో 67వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా కేంద్రాల్లో గణతంత్ర వేడుకలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడవచ్చని ఇంటెలిజన్స్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
హైదరాబాద్, జనవరి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై హెచ్సియూ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
హైదరాబాద్, జనవరి 26: గోదావరి, కృష్ణా జీవనదుల జలాలతో తెలంగాణ భూములు తడవాలి. పచ్చని పంటలతో నేల పరవశించాలి. రాష్ట్ర ప్రజలకు సుఖం, శాంతి చేకూరాలని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహాన్ ఆకాంక్షించారు. మంగళవారం సికిందరాబాద్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహాన్ మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 26: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఐదు రోజులే మిగిలింది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలంతా ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. 30న జింఖానా మైదానంలో తెరాస నిర్వహించనున్న బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. అయితే బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడి గ్రేటర్లో విజయం సాధిస్తే ఏంచేస్తారో స్పష్టంగా వివరించనున్నారు.
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా టిడిపి అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 28, 29 తేదీల్లో నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. టిడిపి-బిజెపి కూటమి తరఫున ఆయన పలు రోడ్డు షోలు, ఎన్నికల సభల్లో పాల్గొంటారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 31న తెరపడనున్న నేపథ్యంలో టిడిపి-బిజెపి నేతలు చంద్రబాబు ప్రచార సభలను ఖరారు చేశారు.
హైదరాబాద్: తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుకాని వాగ్దానాలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ ఆరోపించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మంగళవారం మల్కాజిగిరిలో పార్టీ తరఫున ప్రచార యాత్రలో పాల్గొన్నారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఆరునెలల్లో నగర వాసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
వరంగల్: వచ్చే నెల 17 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో తొలిసారిగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వంద రూపాయల టికెట్తో ప్రత్యేక దర్శనం వల్ల భక్తుల పట్ల వివక్ష చూపుతున్నట్లు వస్తున్న ఆరోపణల రీత్యా అధికారులు ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని క్యూ లైన్లనూ ఉచిత దర్శనం కోసమే వినియోగిస్తారు.