S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/23/2016 - 02:56

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపినే కింగ్ మేకర్ అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుక్రవారం శిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి సలహాలు, సూచనలు చేశారు.

01/23/2016 - 02:55

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కమిటీల నిర్మాణంపై మరి కొంత సమయం ఇవ్వాలని రెండు ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇసుక అక్రమరవాణాపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను కటకం మృత్యుంజయం దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు రెండు రాష్ట్రాలు ఉన్నత స్ధాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

01/23/2016 - 02:55

నల్లగొండ, జనవరి 22: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శ్రీలంక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొలంబోలోని నాలుగు ఆసుపత్రుల్లో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లుగా శ్రీలంక వైద్య శాఖ మంత్రి రజిత సేనరత్నే ప్రకటించారు.

01/23/2016 - 02:54

సంగారెడ్డి, జనవరి 22: ఐదేళ్లుగా జీవనోపాధి కల్పిస్తున్న కన్నతల్లి లాంటి శాఖకు ఏకంగా ఓ చిరు ఉద్యోగి పెద్ద మొత్తంలో సున్నం పెట్టాడు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ రూ.3.13 కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది.

01/23/2016 - 02:54

నల్లగొండ, జనవరి 22: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలకు రక్షిత కృష్ణా మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన సిపిడబ్ల్యుపి పథకాలు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆ పథకాల మనుగడును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా కృష్ణా మంచినీటి పథకాల విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ ఐదు నెలల వేతన బకాయిల కోసం శుక్రవారం నుండి సమ్మెకు దిగారు.

01/23/2016 - 02:53

హైదరాబాద్, జనవరి 22: ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలను ఆశీర్వదించండి..’ అని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టియుడబ్ల్యుజె శుక్రవారం నిర్వహించిన మీట్-ది-ప్రెస్ కార్యక్రమంలో ఎల్. రమణ, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

01/23/2016 - 02:53

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పండ్ల పక్వానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 1వ తేదీన రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

01/23/2016 - 01:16

గోదావరిఖని, జనవరి 22: దక్షణాది రాష్ట్రాల రైతులకు సరిపడే ఎరువులను అందించేందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపట్టి పనులు ప్రారంభిస్తున్నామని కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహెర్ అన్నారు. ఇందుకోసం ప్రధాని ఫిబ్రవరి రెండవ వారంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

01/23/2016 - 01:16

మంచిర్యాల, జనవరి 22: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఇండియన్ బ్యాంక్‌లో బ్యాంకు ఉద్యోగితో పాటు అప్రైజర్ కొంతమంది కలసి బ్యాంకుకు నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రూ.65 లక్షల రుణాన్ని పొంది బ్యాంకుకు టోకరా వేసిన సంఘటన వెలుగు చూసింది. బంగారు ఆభరణాలను సుమారు 43మంది కస్టమర్ల ద్వారా తాకట్టు పెట్టుకున్న బ్యాంకు అధికారులు వారికి రుణాలు ఇవ్వడం జరిగింది.

01/23/2016 - 01:15

కరీంనగర్, జనవరి 22: ఎన్నికలకు ముందు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించి, అధికారం చేపట్టిన అనంతరం వాటిని గాలికొదిలి పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు ఆరోపించారు.

Pages