-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ‘ఎ’ జాబితాలోని ఆదివాసీ, విముక్త సంచార జాతులు, అర్ధ సంచార, అర్ధ నివాస జాతులను ఎంబీసీలుగా ప్రకటిస్తూ జివో నెం.16ను విడుదల చేసిందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీసీ కమిషన్ను పక్కన పెట్టి ప్రభుత్వమే జాబితాలు ప్రకటించడం చట్ట విరుద్ధమని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొల్లాపూర్, ఆగస్టు 11: నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొదలుకుని పీజీ కళాశాలలో చదవుకుంటున్న విద్యార్థులలో ఆంగ్ల ప్రావీణ్యం పెంపొందించేందుకు తన సొంత ఖర్చుతో దక్కన్ క్రానికల్ దినపత్రికలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం పట్టణంలోని పలు ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు.
నిజామాబాద్, ఆగస్టు 11: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేయర్, రాజ్యసభ్య సభ్యుడు డీ. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ గడిచిన పది రోజుల నుండి అజ్ఞాతంలోనే ఉన్నారు. శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన స్థానిక నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్లో సంజయ్పై నిర్భయ చట్టం సహా ఐపీసీ 354, 354(ఏ), 342, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వరంగల్, ఆగస్టు 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15న చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శనివారం వరంగల్ నగరంలోని కేఎంసీ ఎన్ఆర్ఐ గార్డెన్లో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
మెదక్, ఆగస్టు 11: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐదు స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారని, మిగిలిన ఐదు స్థానాల్లో అభ్యర్థుల పోటీ తీవ్రంగా ఉన్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.
మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి, నెలాఖరు లోగా ప్రతి ఇంటికీ మంచి నీరు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద 95 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను శనివారం ఆమె, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు.
భీమదేవరపల్లి, ఆగస్టు 11: పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రంలోని నాలుగు డెయిరీలలో రెండు లక్షల 13 వేల మందికి పాడి గేదెల యూనిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు మంజూరు ఇచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
కరీంనగర్, ఆగస్టు 11: ముందుస్తుగా పలకరించి.. ఆ తరువాత అడపాదడపా మురిపించిన వానలు గత నెలరోజులకుపైగా మేఘాల్లోనే నిద్రపోగా, వర్షం జాడలేక వాడిపోతున్న చిగురాకుపై ఎట్టకేలకు చినుకు రాలింది. వానలను నమ్ముకుని సాగు చేసిన అన్నదాతలు వర్షం కోసం ఆకాశానికేసి తదేకంగా చూస్తున్న తరుణంలో వరుణ దేవుడు కరుణించి, చిరు జల్లులతో పంటలకు జీవం పోశాడు. అన్నదాతలకు ఊరట కలిగించాడు.
యాదగిరిగుట్ట, ఆగస్టు 11: కాకతీయుల కాలంలో రాతి శిల్పాలతో చేపట్టిన గోపురాల నిర్మాణం సెప్టెంబర్లోగా పూర్తవుతుందని యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ఐదు వందల సంవత్సరాల తరువాత యాదాద్రి ఆలయాన్ని మహా అద్భుత దివ్యక్షేత్రంగా మొట్టమొదటి సారి రాతి శిల్పాలతో నిర్మాణం చేయ డం జరుగుతుందని, ఇది ఎంతో శిల్ప నైపుణ్యంతో కూడుకున్నదని కిషన్ రావు అన్నారు.
కరీంనగర్, ఆగస్టు 10: కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్లో నిర్వహించిన మెగా ఫ్రీడమ్ 4కే రన్కు భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ డీఐజీ ప్రమోద్కుమార్, పోలీసు కమిషనర్ కమలాసన్రెడ్డితో పాటు సుమారు 20వేల మంది ఈ రన్లో పాలుపంచుకున్నారు.