S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
నేటి సాంకేతిక యుగంలో జాబ్ మార్కెట్ అంతా వైవిధ్యం, నైపుణ్యంపైనే నడుస్తోంది.. ఓ నాలుగు కొత్త నైపుణ్యాలు సాధిస్తేనే ఉద్యోగాలకు అవకాశం.. ఎంతటి ప్రతిభ ఉన్నా కాలానుగుణంగా నైపుణ్యం పెంపొందించుకుంటేనే ‘కెరీర్ కలలు’ సాకారం అవుతాయన్నది కాదనలేని వాస్తవం.. ఈ క్రమంలో కంపెనీల్లో మారుతున్న సాంకేతిక, వ్యాపార, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థులకు ఎన్నో కొత్త కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి..
మన దేశంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని వాడుతున్న వినియోగదార్లకు ఇంటర్నెట్ స్పీడ్ను అంచనా వేసే ‘ఓక్లా’ అనే సంస్థ ఓ శుభవార్తను అందించింది. నవంబర్ మాసానికి సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం దాదాపు రెట్టింపు అయిందని, ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్తేనని తెలిపింది. కాగా, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్లో భారత్ 109వ స్థానంలో నిలచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్లో 76వ స్థానంలో నిలిచింది.
నేటి సాంకేతిక యుగంలో ఇన్స్టెంట్ మెసేజింగ్కు సంబంధించి వేగంగా దూసుకుపోతున్న యాప్ ఏది అంటే- అందరూ చెప్పే సమాధానం వాట్సాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తనకు పోటీ ఏదీ లేదని సగర్వంగా ఇది చాటి చెబుతోంది. అయితే- వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోనున్నాయి. త్వరలో కొన్ని ఫోన్లలో మాత్రం ఈ యాప్ పనిచేయకుండా వాటికి సపోర్టును నిలిపివేస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.
నోకియా బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఒకటైన నోకియా 6 మరోసారి మార్కెట్లో మెరవబోతోంది. దీనికి సంబంధించిన 2018 వేరియంట్ జనవరిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఎచ్ఎండి గ్లోబల్ నేతృత్వంలో నోకియా బ్రాండ్ నుంచి విడుదలైన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్గా ‘నోకియా-6’ చరిత్ర సృష్టించింది.
లండన్లో కొద్ది రోజుల క్రితం హువాయి సబ్ బ్రాండ్ ఆనర్ సంస్థ తన ప్రతిష్ఠాత్మక స్మార్ట్ఫోన్ హానర్ వ్యూ 10ని విడుదల చేసింది. ఈ ఫోన్ను జనవరి 8న జరిగే గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఇండియాకి పరిచయం చేస్తామని ఆనర్ తెలిపింది. గత వారం చైనాలో ఆనర్ వ్యూ వి10 తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి విదితమే. దీని ధర ఇండియాలో సుమారుగా 38వేల రూపాయలు ఉంటుందని అంచనా.
అలరించే ఫీచర్లు
మొబైల్ దిగ్గజం ‘హువాయి’ సంస్థ తన నూతన స్మార్ట్ఫోన్ ‘నోవా 2ఎస్’ను తాజాగా చైనా మార్కెట్లో పరిచయం చేసింది. 4.6 జిబి ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.26,350గా నిర్ణయించింది. ఈ ఫోన్లో మొత్తం నాలుగు కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ అతి త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానుంది.
ఇందులోని ఫీచర్లు
హెచ్ఎండి గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్ఫోన్కు ఈమధ్యే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్డేట్ను విడుదల చేసింది. ఇప్పుడు నోకియా 5 స్మార్ట్ఫోన్కు కూడా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్డేట్ను అందిస్తున్నది. అయితే, ఇది బీటా వెర్షన్ మాత్రమే. పూర్తి స్థాయి వెర్షన్ కాదు. అయినప్పటికీ ఈ కొత్త అప్డేట్ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తమ నోకియా 5 స్మార్ట్ఫోన్లో నోకియా అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి.
ఉదయం లేవగానే మొబైల్ చేతిలో వుంటే ముందుగా చెక్ చేసేవి ఎస్సెమ్మెస్లు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ వినియోగం ప్రారంభించిన తొలినాళ్లలో ఎస్ఎంఎస్లు ‘నెట్’ లేకుండానే పంపేవాళ్ళం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇపుడు ఆ ఎస్ఎంఎస్ 25 వసంతాలు పూర్తిచేసుకుంది. 1992 డిసెంబర్ 3న నెయిల్ పాప్వర్త్ అనే ఇంజనీర్ తొలి సందేశాన్ని పంపించారు.
ఆమెకు వైద్యవిద్య అంటే అంతగా ఆసక్తి లేదు.. అయిష్టంగానే మెడికల్ ఎంట్రన్స్కు హాజరై ఆ తర్వాత వైద్య కళాశాలలో చేరింది.. తరగతులకు హాజరు కావడం మొదలయ్యాక వైద్యవిద్యకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలుసుకుని కష్టపడి మెడిసిన్ పూర్తి చేసింది.. మొదట్లో ఆసక్తి చూపని వైద్యవిద్యలో అద్భుతాలు సాధించి అందరి చేత ‘ఔరా’ అన్పించుకుంది.
స్మార్ట్ఫోన్కు బానిసలవుతున్న యుక్తవయస్కుల్లో ఆతృత, నిద్రలేమి, మనోవ్యాకులత వంటి సమస్యలు అధికం అవుతుండగా, పిల్లలకు సంబంధించి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘రేడియోలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా’కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని ప్రకటించారు.