S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 04:11

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును అందుబాటులోకి తెచ్చి 20 రోజులు గడుస్తున్నా.. ప్రజలకు కరెన్సీ కష్టం తప్పడం లేదు. ‘కొత్త’ నోటుకు బ్యాంకుకు వెళితే సిబ్బంది తీరు వల్ల ఆసుపత్రి పాలయ్యారు. పైకానికి పోతే ప్రాణం మీదకు తెచ్చారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్దకు డబ్బుల కోసం గురువారం వెళ్లిన ప్రజలు బారులు తీరారు.

12/02/2016 - 04:07

హైదరాబాద్, చాదర్‌ఘాట్, డిసెంబర్ 1: మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు గురువారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మిర్చి, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆన్‌లైన్ మార్కెట్‌పై అధికారులకు, రైతులు, గుమస్తాలు, కమీషన్ ఎజెంట్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

12/02/2016 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 1: వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములు అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. దీనిని ఆచరణలోనికి తీసుకు రావడానికి కార్యాచరణ కోసం ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష జరిపారు.

12/02/2016 - 03:44

మచిలీపట్నం, డిసెంబర్ 1: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎల్లకాలం సాగదని, ఆయన ప్రభుత్వం మనుగడ రెండేళ్ళు మాత్రమేనని, దేవుడు దయదలిస్తే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.’ అని శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు చేపట్టిన 33 వేల ఎకరాల భూ సమీకరణను నిరసిస్తూ గురువారం రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

12/02/2016 - 03:41

విజయవాడ (క్రైం), డిసెంబర్ 1: గుంటూరు బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం నిరీక్షిస్తున్న సామాన్యులపై పోలీసుల దాడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఖండించారు. అనంతపురం ఘటనపై పోలీసుశాఖ తరఫున ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. గుంటూరులోని నగరం పాలెం, పాత గుంటూరు పోలీస్టేషన్లను ఆదర్శ పోలీస్టేషన్లుగా నిర్మిస్తూ జరుగుతున్న పనులను గురువారం తనిఖీ చేశారు.

12/02/2016 - 03:39

అమరావతి, డిసెంబర్ 1: ‘సార్ కేంద్రం బంగారంపై ఆంక్షలు పెడితే ఆడవాళ్లు ఊరుకోరు. మీరు ఇప్పుడు సంక్షోభ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. మీరు ప్రధానికి ఫోన్ చేసి అలాంటి ఆంక్షలు వద్దని చెప్పండి. మహిళల మనోభావాలు దెబ్బతింటే రాజకీయంగా మనమూ నష్టపోతామ’ని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు.

12/02/2016 - 03:38

భీమవరం, డిసెంబర్ 1: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా జరిగే కోడి పందాల జాతరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. పందాలకు అవసరమైన కోడిపుంజుల పెంపకం ఈ జిల్లాలో కుటీర పరిశ్రమగా వర్థిల్లే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని పలు రహస్య ప్రాంతాల్లో కోడిపుంజుల పెంపకం జోరుగా సాగుతోంది. ఇక కోట్లలో జరిగే ఈ పందాల్లో రూ.500, రూ.1000 నోట్లే చెలామణీ అవుతాయి.

12/02/2016 - 03:36

విజయవాడ, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రాలకు ఆర్‌బిఐ కేటాయిస్తున్న నగదు, తదితర అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నీతి ఆయోగ్ నియమించిన కమిటీ కన్వీనర్ కూడా అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. దేశంలో డిజిటల్ చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నీతి ఆయోగ్ ఏర్పాటా చేయడం తెలిసిందే.

12/02/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల నుంచి ఇష్టం వచ్చినట్లు పూడికను వెలికి తీసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గుంటూరు నగరంలోని పోతూరు చెరువు నుంచి పూడికను తీసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన అభియోగాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

12/02/2016 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 1:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17నుంచి ఏప్రిల్ 1 వరకూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1నుంచి 17వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏపిలో ఇంటర్ పరీక్షలను తెలంగాణ పరీక్షల షెడ్యూలు సమయంలోనే నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీ, ఒకే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Pages