S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/18/2017 - 03:07

రాజమహేంద్రవరం, నవంబర్ 17: లంక భూమి సాగుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ జలనవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి..

11/18/2017 - 03:06

మడకశిర, నవంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సంబంధిత కమిటీ పునఃసమీక్షించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత దశాబ్ధకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులు ప్రజాదరణ పొందిన వారికి, కమిటీ ఎంపిక చేసిన వారికే ఇస్తుండేవారన్నారు.

11/18/2017 - 03:06

విశాఖపట్నం, నవంబర్ 17: కాఫర్ డ్యామ్‌పై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడం తగదని రోడ్లు, రహదారుల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.

11/18/2017 - 02:56

గుంటూరు, నవంబర్ 17: కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏపి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది.

11/18/2017 - 02:54

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు.

11/18/2017 - 02:54

గుంటూరు, నవంబర్ 16: మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక పోరు సాగుతోంది. గత కొనే్నళ్లుగా అగ్రవర్ణ ఆధిపత్యం, దళితవాదంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రష్యాలో కమ్యూనిజం పతనానంతరం చైనా అనుసరిస్తున్న ధోరణులపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది.

11/18/2017 - 00:42

విజయవాడ, నవంబర్ 17: డిసెంబరు, జనవరిలో ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో ఫెలికాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరులో విస్తరించియున్న కొల్లేరు సరస్సులో ఉన్న ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో డిసెంబరు, జనవరి నెలల్లో ఆటపాకలో పెలికాన్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.

11/18/2017 - 00:42

విజయవాడ, నవంబర్ 17: గత కొంత కాలంగా పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న పులుల సంఖ్యలో పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ 17 పులులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవల శాసన మండలిలో ప్రకటించారు. దాదాపు 3 లక్షల ఎకరాల్లో పాపికొండలు నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. అభయారణ్యం కావడంతో అనేక రకాల వన్యప్రాణులకు నెలవుగా మారింది.

11/18/2017 - 00:42

విశాఖపట్నం, నవంబర్ 17: రాష్టవ్య్రాప్తంగా ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించి అందించాలన్న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయం మేరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో 19 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

11/18/2017 - 00:41

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో హరిత రహదారుల నిర్మాణానికి సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 7 ఎక్స్‌ప్రెస్ రేడియల్ రహదారులు హరిత రహదారులుగా రూపుదిద్దుకొంటున్నాయి.

Pages