S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/20/2017 - 04:16

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్ర విభజన అనంతరం అంతులేని ఆశలు చూపి, లేదా బెదిరించి దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏడాది పొడవునా పలురకాల పంటలు పండించే రైతుల నుంచి దాదాపు 34వేల ఎకరాల భూమిని సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెంపదెబ్బ లాంటిదేనని ఆ కేసులో ప్రధాన పిటిషనర్‌దారుడైన పండలనేని శ్రీమన్నారాయణ అన్నారు.

11/20/2017 - 04:13

అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండో దశ విద్యుత్ సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా పథకంతో మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏపీ ఈ ఫలాలను వినియోగదారులకు చేర్చడానికి నిశ్చయించింది. రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధి కోసం 15శాతం వృద్ధిరేటు సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

11/20/2017 - 04:12

విజయవాడ (ఇంద్రకీలాద్రి), నవంబర్ 19: కార్తీక మాసోత్సవం ముగిసిన సందర్భంగా ఆదివారం వేకువజామున మహిళలు భక్తిప్రపత్తులతో ‘పోలి స్వర్గం’ కార్యక్రమం నిర్వహించుకున్నారు. వందల సంఖ్యలో మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టటంతో వేకువజామున పవిత్ర కృష్ణానది దీపకాంతులతో వెలిగిపోయింది. భక్తులు తొలుత కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గట్టు మీద దీపారాధన చేశారు.

11/20/2017 - 03:57

పాయకాపురం, నవంబర్ 19: కార్తీక మాసం ముగిసిన సందర్భంగా కృష్ణా జిల్లా మంగళాపురం దగ్గర పోలవరం కాలువలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఓ బాలిక నీటిలో గల్లంతైంది. నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని పాతపాడు మంగళాపురంలో నివాసముంటున్న సోమిశెట్టి పానయ్య తాపీపని చేస్తుంటాడు. ఇతని కుమార్తె శే్వత(13) స్థానిక సెయింట్ జోసఫ్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది.

11/20/2017 - 03:55

విశాఖపట్నం, నవంబర్ 19: దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) అమ్మకాన్ని విరమించుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జగదాంబ జంక్షన్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/20/2017 - 03:55

పుట్టపర్తి, నవంబర్ 19: పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకల్లో భాగంగా గానకోకిల పి.సుశీల, విశ్వవిఖ్యాత పాప్‌సింగర్ దానాగిలస్పేకు జీవితకాల సాఫల్య పురస్కారాలు అందించారు. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి సన్నిధిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సత్యసాయి ఇందిరమ్మ వెల్ఫేర్ ట్రస్టు జీవితకాల సాఫల్య పురస్కారాలను ట్రస్టు చైర్మన్ చేతనరాజ్ వీరికి అందజేశారు.

11/20/2017 - 03:53

చీరాల, వేటపాలెం, నవంబర్ 19: ఒకే ప్రాంతానికి చెందినవారంతా కలసి వన భోజనాలు చేసేందుకు వచ్చారు. అనుకోకుండా జరిగిన హఠాత్పరిణామం వారిలో ఇద్దరిని బలి తీసుకుంది. కళ్లముందే సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏమీచేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అలల్లో చిక్కుకున్న మహిళలను రక్షించే ప్రయత్నంలో ఓ యువకుడిని మృత్యువు కబళించగా, మరో వ్యక్తి కెరటాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.

11/20/2017 - 03:52

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు, నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు ‘సున్నా’ డిగ్రీలకు చేరుకున్నాయి! వినడానికి వింతగా ఉన్నప్పటికీ, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ఇది నిజమేనంటోంది. ఐఎండీకి చెందిన హైదరాబాద్ మీట్రియోలాజికల్ సెంటర్ వెబ్‌సైట్లో రెండు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలను తప్పులతడకగా నమోదు చేస్తున్నారు.

11/20/2017 - 03:18

విజయవాడ, నవంబర్ 19: ముందస్తు అరెస్ట్‌లు, నిర్బంధాలతో సోమవారం జరిగే ‘చలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమాన్ని ఆపలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపి ఎం నేత సిహెచ్ బాబూరావు అన్నారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీ ఓబులేసు, జల్లి విల్సన్, రావుల వెం కయ్యతో కలిసి వారు మాట్లాడారు.

11/20/2017 - 03:17

జగ్గయ్యపేట, నవంబర్ 19: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పట్టణ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తాను ఆదివారం ఉదయం సామినేని ఉదయభాను ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన రాజగోపాల్ గత ఎన్నికల్లో సహకరించలేదంటూ తనపై దౌర్జన్యం చేసి కొట్టారని, తన కారులో నుండి కత్తి తీసి చంపబోయారని నంబూరి రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

Pages