S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/20/2017 - 03:16

అమరావతి, నవంబర్ 19: మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ‘అసలు-నకిలీ బీజేపీ’ వ్యాఖ్యలపై కమలంలో సీనియర్ల మధ్య అంతర్యుద్ధం మొదలయింది. పోలవరంపై పురంద్రేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నకిలీ బీజేపీ నేతలే మాట్లాడుతున్నారు తప్ప, ఒరిజినల్ బీజేపీ నేతలు మాట్లాడటం లేదంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఖండన పర్వానికి తెరలేవకపోవడంపై, భారతీయ జనతా పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది.

11/20/2017 - 03:11

విజయవాడ, నవంబర్ 19: ఒకే పంట విధానానికి స్వస్తిచెప్పి అన్ని రకాల పంటలను పండించే విధానాలను రైతులు అలవరచుకోవాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వరి పంటతో పాటు రైతులు ఆరుతడి పంటలను కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

11/19/2017 - 04:24

ఉయ్యాలవాడ, నవంబర్ 18: తమ సమస్యలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని పలువురు రైతులు వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్ర 11వ రోజు శనివారం కర్నూలు జిల్లా దొర్నిపాడు నుంచి తిరిగి ప్రారంభమైంది. దొర్నిపాడు నుంచి ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ వరకు జరిగిన యాత్రలో దారి వెంట సీడ్ పత్తి రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దసంఖ్యలో తరలివచ్చిన యువనేతను కలిశారు.

11/19/2017 - 04:22

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చిన షరుతులతో కూడిన అనుమతులతో రాజధాని మాస్టర్ ప్లాన్ కథ మొదటికొచ్చినట్టయింది. ఎన్‌జీటీ తీర్పునకు అనుగుణంగా.. రాజధాని నిర్మాణానికి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమని అధికారులు చెబుతున్నారు.

11/19/2017 - 04:21

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయంతి వేడుకల ప్రారంభం రోజు శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం సాయికుల్వంత్ హాలులో వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రకరకాల పూలతో అందంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఆశీనులను చేసి పూజలు, హారతి ఇచ్చారు.

11/19/2017 - 04:19

పోలవరం, నవంబర్ 18: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 10 మోటార్లను శనివారం నుండి నిలిపివేసి, మిగిలిన 14 మోటార్ల ద్వారా 4,900 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో గత జూన్ 19న ఎత్తిపోతలలోని 24 మోటార్లను ఆన్‌చేసి రోజుకు 8500 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలింపు ప్రారంభించారు.

11/19/2017 - 04:19

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 18: ఆధునిక సమాజంలో సోషల్ మీడియా కీలకమైన భూమిక పోషిస్తోందని, సమాజంలో జరిగే అనేక అంశాలకు చర్చా వేదికగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎ-కనె్వన్షన్ సెంటర్‌లో దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న సోషల్ మీడియా సమ్మిట్-17లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

11/19/2017 - 03:31

కాకినాడ, నవంబర్ 18: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాష్టస్థ్రాయిలో డిసెంబరు 19నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

11/19/2017 - 03:29

తిరుపతి, నవంబర్ 18: శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను లారీలో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు సాహసోపేతంగా వెంటాడి పట్టుకున్న సంఘటన శనివారం ఉదయం జరిగింది. పట్టుబడ్డ లారీలో 82 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమాని, డ్రైవర్ అయిన తమిళనాడుకు చెందిన శంకర్‌ను, మరో కీలక స్మగ్లర్‌గా భావిస్తున్న శివాజీని అరెస్టు చేశారు.

11/19/2017 - 03:25

విశాఖపట్నం, నవంబర్ 18: ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునెస్కో సం యుక్తంగా ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు టెక్ కాన్ఫరెన్స్ - 2017 నిర్వహించనుంది. సదస్సుకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రి అజోలే హాజరుకానున్నట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి వెల్లడించారు.

Pages