S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/28/2017 - 03:40

విశాఖపట్నం, ఏప్రిల్ 27: దేశ భక్తికి ఆ కుటుంబం అంకితం. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు గడచిన 18 సంవత్సరాల నుంచి ఆర్మీలో జనాన్లుగా పనిచేస్తున్నారు. జమ్ములో ఉగ్రవాదులో గురువారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో వీరిద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరి కొద్ది గంటల్లో విధులు ముగించుకుని స్వగ్రామమైన విశాఖకు రావల్సిన తన కొడుకు ఉగ్రమూకల దాడికి బలైపోయాడని తెలిసి తండ్రి కుప్ప కూలిపోయాడు.

04/28/2017 - 03:37

కాకినాడ, ఏప్రిల్ 27: ఎపి ఎంసెట్-2017 అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నిర్వహించడానికి జెఎన్‌టియుకె పటిష్ట ఏర్పాట్లుచేసింది. ఇంజనీరింగ్ పరీక్షలు ఈనెల 26వ తేదీతో పూర్తయిన విషయం విదితమే. మూడు రోజుల పాటు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించగా, అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలను ఒక్కరోజులో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.

04/28/2017 - 03:36

నెల్లూరు, ఏప్రిల్ 27: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బెట్టింగ్‌కు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా సభ్యులను నెల్లూరు నగర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి భారీ నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని గురువారం ఇక్కడ తెలిపారు. .

04/28/2017 - 03:36

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 27: అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఒక చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అవినీతి నిరోధకశాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ ఆర్‌పి ఠాకూర్ వెల్లడించారు. రెవెన్యూరికవరీ చట్టం తరహాలో ఒక నెల రోజుల్లో ఈచట్టాన్ని కార్యాచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎసిబి కార్యాకలాపాలను పునర్‌వ్యవస్థీకరించనున్నట్టు ఆయన తెలిపారు.

04/28/2017 - 03:35

భీమవరం, ఏప్రిల్ 27: రాజవౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి-2 విడుదల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత అనుభవాల నేపథ్యంలో అధికార్లు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

04/28/2017 - 03:34

చిత్తూరు, ఏప్రిల్ 27: ఏర్పేడు ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా అనేక మంది గాయపడిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సమగ్ర నివేదికఅందజేయాలని కలెక్టర్ కార్యాలయానికి గురువారం సమాచారం అందింది. మరణించిన , గాయపడిన వారి వివరాలు అందివ్వాలని సూచించింది.

04/28/2017 - 02:36

విజయవాడ, ఏప్రిల్ 27: విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలోని ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో జాప్యంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు సచివాలయంలో సిఎంను కలిశారు. కోర్టు భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై సిఎం దృష్టికి తీసుకువచ్చారు. జాప్యానికి కారణాలను సిఎం అడిగి తెలుసుకున్నారు.

04/28/2017 - 02:34

నంద్యాల టౌన్, ఏప్రిల్ 27: పేదపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆదేశాలు జారీ చేశామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ఫౌండేషన్ కోర్సులు సైతం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

04/28/2017 - 02:01

సింహాచలం, ఏప్రిల్ 27: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం శనివారం జరగనుంది. 364 రోజులు చందనం ముసుగులో ఉన్న సింహాద్రి నాథుడు వైశాఖ శుద్ద తదియ సందర్భంగా శనివారం భక్తకోటికి తన నిజరూప దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించనున్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు.

04/28/2017 - 01:55

పాలకొండ (టౌన్), ఏప్రిల్ 27: భర్త వేధింపులకు తాళలేక అతని భార్య, కుమారుడు కిరోసిన్ పోసుకొని సజీవ దహనమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధి జెట్టివారి వీధికి చెందిన చందనాల ప్రమీల (25), ఆమె కుమారుడు సాయి (5) ఎన్‌కె రాజపురం గ్రామానికి వెళ్లే రహదారిపై ఒంటిపై కిరోసిన్ పోసుకొని గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Pages