S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/29/2017 - 02:12

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక మీడియాను అడ్డంపెట్టుకుని ఎపి సిఎం చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని ప్రసారమాధ్యమాలు పనిగట్టుకుని జగన్ బెయిల్ రద్దు అయ్యిందంటూ కథనాలు ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

04/29/2017 - 02:26

గుంతకల్లు, ఏప్రిల్ 28: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తిరుపతి- జమ్మూతావి హమ్ సఫర్ నూతన రైలుకు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతి నుంచి బయలుదేరి గుంతకల్లు రైల్వేస్టేషన్ చేరుకున్న హమ్‌సఫర్ ఏసి రైలును గుంతకల్లు డివిజనల్ మేనేజర్ అమిత్ ఓజా, ఎడిఆర్‌ఎం సుబ్బరాయుడు పరిశీలించారు. ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ హమ్ సఫర్ రైలులో మొత్తం కోచ్‌లన్నీ ఏసివి కావడం గమనార్హం.

04/28/2017 - 03:56

అమరావతి, ఏప్రిల్ 27: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్పష్టతతో వెళితే సత్ఫలితాలు సాధిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.

04/28/2017 - 03:55

విజయవాడ, ఏప్రిల్ 27: రాష్ట్రంలో 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను ఒక ప్రశ్న అడుగుతున్నారని తెలిపారు.

04/28/2017 - 03:54

విజయవాడ, ఏప్రిల్ 27: రాష్టవ్య్రాప్తంగా బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సచివాలయ ఉద్యోగులతోపాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని సునీత తెలిపారు. అందుకోసమే సచివాలయంలో ప్రత్యేకంగా బేబీకేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

04/28/2017 - 03:54

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 27: అగ్రిగోల్డ్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఏపి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ కేసులో మొత్తం 19మందిని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేయగా వీరిలో ఇప్పటి వరకు 11మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా అవ్వా ఉదయ్ భాస్కరరావు (56), అవ్వా వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ (53)లను అరెస్టు చేశారు.

04/28/2017 - 03:53

విజయవాడ, ఏప్రిల్ 27: అమరావతిలో అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం (ఎయిమ్స్) నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో కలిసిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సికే మిశ్రాతో ఎయిమ్స్ ఏర్పాటు పురోగతి గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

04/28/2017 - 03:53

విజయవాడ, ఏప్రిల్ 27: జీవితంలో ఎదగడానికి పేదరికం అడ్డంకి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొప్ప గొప్ప వాళ్లంతా పేదరికం నుంచే వచ్చారని, సాధించాలన్న తపన ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆరువారాల శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థుల నుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

04/28/2017 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 27: అనంతపురం జిల్లాలో కొరియాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కియా ఏర్పాటు చేసే ప్లాంట్‌లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

04/28/2017 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 27: వేసవిలో ఎటువంటి తరగతులు నిర్వహించినా, ఆ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించి 24 గంటలు గడవక ముందే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తరగతులను గురువారం ప్రారంభించాయి. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ తదితర పేర్లతో తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

Pages