S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
దాదాపు నాలుగు వందల తొంభై సంవత్సరాలుగా కొనసాగుతున్న అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం మధ్యవర్తిత్వం, సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే పరిష్కారం అవుతుంది. హిందూ, ముస్లిం మతాలకు చెందిన నాయకులు పెద్ద మనసుతో వ్యవహరించి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. సుప్రీం కోర్టు ఎంతో దూరాలోచనతో అయోధ్య వివాదంపై వెంటనే తీర్పు ఇవ్వకుండా మధ్యవర్తిత్వానికి తెర లేపింది.
పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ స్థావరంపై మెరుపు దాడులు చేయించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పరువుప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ప్రపంచం దృష్టిలో మన గౌరవ మర్యాదలను మరింతగా పెంచారు. వ్యూహాత్మకంగా చేసిన వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పారు. పాకిస్తాన్ను అన్ని విధాలా ఆదుకుంటున్న చైనాకు సైతం స్పష్టమైన సందేశం పంపించడంలో మోదీ విజయం సాధించారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు పుల్వామాలో కారుతో ఆత్మాహుతి దాడి చేసి నలభై మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను పొట్టన పెట్టుకున్న సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం శోచనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని అడ్డం పెట్టుకుని అధికార పార్టీని విమర్శించటం వలన ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రయోజనం కలుగుతుందనే నిప్పులాంటి నిజాన్ని ప్రతిపక్ష నాయకులు గ్రహించటం మంచిది.
ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్లో అనునిత్యం మారణ హోమం సృష్టిస్తున్న పాకిస్తాన్ను శత్రుదేశంగా మన నేతలు ఎందుకు ప్రకటించరాదు? మన దేశాన్ని శత్రుదేశంగా భావిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కూడా పాకిస్తాన్ను శత్రుదేశంగా ప్రకటించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయటం ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక బెడిసికొడతాయా? ముఖ్యంగా రాహుల్ ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకుని భీకరదాడి కొనసాగిస్తున్నారు. ‘మోదీ దొంగ’ అంటూ అనునిత్యం ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ప్రతిసారీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తాయిలాలు, రాయితీలు ప్రకటించే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరాల జల్లు కురిపించడం వెనుక- ఓట్లు దండుకోవాలనే దురాలోచన తప్ప మరొకటి కనిపించటం లేదు.
ప్రియాంకా వాద్రా ఎట్టకేలకు గత్యంతరం లేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ కష్టాలు తీరుతాయా? జాతీయ స్థాయిలో తన మనుగడను నిలుపుకొంటుందా? అనే ప్రశ్నలకు రాబోయే పరిణామాలే సమాధానం ఇస్తాయి. ప్రియాంక రంగప్రవేశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రతిపక్షాల సమైక్యతను నారింజ పండుతో పోల్చారు. నారింజ పండు బైటికి ఒకటిగానే కనిపిస్తుంది కానీ, లోపల తొనలన్నీ విడివిడిగానే ఉంటాయి. ప్రతిపక్ష నేతలు పైకి ఒకటిగా కనిపించినా, లోపల ఎవరికి వారేనన్నది ఆయన విమర్శ. పాశ్వాన్ పోలిక కొంతవరకూ నిజమే. వాస్తవానికి ప్రతిపక్షం నారింజ పండు మాదిరి బైటికి ఒకటిగా కనిపించటం లేదు.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఇస్తున్న రిజర్వేషన్లు, తాజాగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి ఇస్తున్న రిజర్వేషన్లు ఓట్లు దండుకునే మంత్రాంగంగా మారటం శోచనీయం. రాజకీయ నాయకులు తమ పదవులను పదిలం చేసుకునేందుకు రిజర్వేషన్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఆయా సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్దికి ఉపయోగించటం లేదు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరుగుతున్నాయా? లేదా?
రాజకీయ పార్టీలు నేడు ఓటుబ్యాంకు కోణంలో పార్లమెంటును బలి తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, డీఎంకే, తెలుగుదేశం సహా మరి కొన్ని ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమం పేరుతో పార్టీ ప్రయోజనాలు, అధికారం కోసం పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నాయి.