S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/23/2019 - 22:21

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుప్త ఫౌండేషన్ ప్రతి ఏటా ప్రకటించే కృష్ణమూర్తి సాహితీ పురస్కారానికి 2019 సంవత్సరానికి గాను చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ ఎంపికయ్యారు. ఈ పురస్కారం కింద రెండులక్షల నగదు, సత్కారం జరుగుతుందని గుప్త ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31న ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించనుంది. గతంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రొ.

10/23/2019 - 22:19

యుద్ధం ముగిసిన చోట
మరో ఆంతరంగిక యుద్ధం జరుగుతుంది

స్వప్నాలు ఎగిరిపోతుంటే
మంచు చరియలు విరిగిపడి కప్పబడిన
దేహాల్లోంచి ధైర్యంగా నడిచిన
విజయకేతనమే కలల సాకారం

తూటాలను గుండెల్లో నాటిన
సైనిక సాహసమే
సరిహద్దుల వెంట పహారా కాస్తుంది
మెరుపు దాడుల వెంట
రాజనీతి బోధపడుతుంది

ఆక్రమితమెప్పుడూ ముంపునకు
దారితెరిచే ఉంటుంది

10/23/2019 - 22:14

2019 సంవత్సరానికి గాను నారంశెట్టి బాలసాహిత్య పురస్కారానికి డీ.కే.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణలను ఎంపిక చేసినట్లు నారంశెట్టి బాలసాహిత్య పీఠం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నవంబర్ 14న విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగే సభలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద ఐదువేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నారు.

10/14/2019 - 22:14

నిజమైన
సన్మానమంటే...
సభా సదనంలో
విజ్ఞుల సమక్షాన
వ్యక్తి ప్రతిభకు జరిపే
ఓ పట్ట్భాషేకం!

కీర్తి సింహాసనాన్ని ఎక్కించి
ఊహాలోకాల్లోకి
లాక్కొని వెళ్ళే
ఓ అపురూప సన్నివేశం!

స్వీకర్త వదనమనే పూదోటలో..
ముసిముసి నవ్వులు పువ్వులై
వేదికకు...
వెలుగులు పంచుతాయి!

10/14/2019 - 22:12

ఒకడు
మైళ్ళ పొడుగునా
భుజం మీదో
సైకిల్ మీదో
తల్లి శవాన్నో, తండ్రి శవాన్నో
మోసుకెళ్తాడు

మరొకడు
చేతులూ కాళ్ళూ విరిచి గోనెసంచిలో
మూటకట్టుకొని పరుగెడతాడు

10/14/2019 - 22:10

దుఃఖపు మూట చిట్లి
ఆనందం తెరలు తెరలుగా
గుండె శిఖరం మీద వాలుతుందేమోనని
కనుచూపుల్ని భవిష్యత్ కాలానికి
తగిలించేసి ఎదురుచూస్తున్నా
విషాదం గరళమై ఘనీభవిస్తూ
కనుపాపల మధ్య వేలాడుతోంది
బతుకు నిత్య కన్నీటి దృశ్యమై
అష్టకష్టాల కాన్వాసుపై
వెలసిన రంగులద్దుకుంటోంది
వేదనలు ఆవేదనలు
జన్మజన్మల బంధమన్నట్లు
మనోఫలకంపై

10/14/2019 - 22:08

మహాత్మాగాంధీ మహాభినిష్క్రమణంతోపాటే ఆయన మనుషులందరూ మాయమైపోయినట్లు వర్తమాన రాజకీయ భారతదేశ చిత్రపటాన్ని చూస్తే విచారం కలుగుతుంది. కర్మణా, మనసా, వాచా గాంధీజీని అనుసరించినవారు శ్రీ టి.వి.ఎస్.చలపతిరావు (1911-1979). నిష్కలంకోజ్జ్వల జీవితం వీరిది. గాంధీజీ ఆదర్శాల, ఆశయాల సాచరణ కార్యరూపం శ్రీ టి.వి.ఎస్.దైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, దేశ పునర్నిర్మాణ, సత్యాహింసాచరిత, త్యాగ సంభృతమూర్తిమత్వం.

10/14/2019 - 22:07

కవిత
ఒక ఆదిమ శబ్దం
బహు పాతది
నిషాదుడు ధర్మం తప్పినప్పుడు
శోకం శ్లోకమయ్యంది
తన మాటకు తానే విస్మితుడైతే
ఆ కవికి అది సార్థకత

శబ్దార్థాలు సరే
భావార్థమే కష్టం.
సంగీతాన్ని కన్నది వెదురు కాదు
దానిలో నిండిన ఊపిరి.

10/14/2019 - 22:05

సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి సాహిత్య సాంస్కృతిక సంస్థ కవిసంధ్య ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ రచయత్రి ఓల్గా ఎంపికయ్యారు. అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం యానాంలో జరిగే కార్యక్రమంలో ఓల్గాకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య కార్యదర్శి దాట్ల దేవదానంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శిఖామణి కవితా సంపుటి ‘యానాం కవితలు’ ఆవిష్కరణ జరుగుతుంది.

10/07/2019 - 00:57

జనం జనం
గుంపులు గుంపులు
వస్తున్నారు
కదిలిపోతున్నారు
నవ్వారు.. ఏడ్చారు
ఏమయంది నిన్నటిదంతా?
ప్రేమించారు.
ఒక్కటనుకున్నాను
రెండని వేరయనప్పుడు
దిగంతాల దుఃఖం
ఆలోచనా తరంగాలు
వేలకి వేలు.. వస్తూ పోతూ
మనసు నిండా జ్ఞాపకాల ముద్రలు
కలలు.. కలలు
తియ్యనివి కమ్మనివి
మరొక్క కొత్త జ్ఞాపకం
నిన్నటిదయపోయంది

Pages