S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 22: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫిబ్రవరి నెలలో కొత్తగా మూడు లక్షలకు పైగా ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. దీంతో ఈ పరిశ్రమలో మొత్తం ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య 8.88 కోట్లకు పెరిగింది. ఇలాంటి పథకాలలో ఉన్న మార్కెట్ రిస్క్ల గురించి మదుపరులకు గల అవగాహనను ఇది సూచిస్తోంది. అయితే, అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య వృద్ధిలో వేగం తగ్గింది.
విజయవాడ పశ్చిమ, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించాలని స్వయంగా భారత ప్రధాని జనతా కర్ఫ్యూకి ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు విజయవంతం చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి సహకరించారు. ప్రముఖ వ్యాపార స్థావరాలు సైతం మూతబడ్డాయి. రాజకీయ అలజడులు ప్రతిపక్షాలు నిర్వహించే భారత్ బంద్లు సైతం గతంలో అసంపూర్తిగా జరిగాయి.
విజయవాడ (క్రైం), మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో తీవ్ర ఆంక్షలు విధించారు. నగరంలోని ఓ యువకుడికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నగరంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరింత ఆందోళన ప్రజల్లో నెలకొంది.
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ నగరంలో విజయవంతమైంది. నగర వ్యాప్తంగా ప్రజలందరూ కర్ఫ్యూని పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిర్విఘ్నంగా జరిగిన జనతా కర్ఫ్యూలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతపడ్డాయి.
లబ్బీపేట, మార్చి 22: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోనికి వస్తాయన్నారు. నలుగురైదుగురూ ఎక్కడా గుమికూడ రాదు ఉల్లఘించిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతాయన్నారు.
అభినంధనలు
విజయవాడ, మార్చి 22: దేశానికి ముంచుకొస్తున్న పెను ఉపద్రవాన్ని ఏదోవిధంగా నివారించే విషయంలో ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చాలా సీరియస్గా స్పందించి శరవేగంతో అడుగులు వేస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. కరోనా వైరస్ విషయమై తాను ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడుతో ఫోన్లో ఆదివారం ఉదయం మాట్లాడినట్లు చెప్పారు.
విజయవాడ, మార్చి 22: యావత్ ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న తరుణంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న ఈ సమయంలో అకుంఠిత దీక్షతో మొత్తం మానవజాతి మహాయుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ అనే రెండే అంశాలు ప్రస్తుతం మన ఆయుధాలని తెలిపారు.
విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు. ఓ యువకుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో ఆదివారం సాయంత్రం నుండి అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా బాధితుని ఇంటి పరిసరాల్లో చుట్టూ కిలోమీటర్ మేర వీధులన్నింటినీ మున్సిపల్ అధికారులు బారికేడ్లతో మూసేశారు. ఐరన్ మెష్లు, ఐరన్ రాడ్ల సాయంతో పలువీధుల్లో రాకపోకలు నివారించారు.
విజయవాడ క్రైం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై మన దేశం యుద్ధాన్ని ప్రకటించటంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న భద్రతాపరమైన చర్యల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31వరకు లాక్డౌన్ పాటించాలని పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
మచిలీపట్నం: కొరలు చాస్తున్న కరోనా మహమ్మారి స్వీయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లా వాసులు జనతా కర్ఫ్యూని పాటించారు. దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించి ఇళ్లకు పరిమితం కావడం విశేషం.